టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నానీ, ప్రియాంక మోహన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’. ఇక ఈ మూవీని టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో ‘అంటే సుందరానికి’ అనే మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వీరి కాంబోలో తెరకెక్కనున్న సరిపోదా శనివారం మూవీ ఈ ఆగస్టు 29న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో.. మూవీ మేకర్స్ ఇప్పటి నుంచే జోరుగా ప్రమోషన్స్ ప్రారంభిస్తున్నారు. అయితే ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా నాని అండ్ మూవీ టీమ్ ముంబయికు బయలుదేరగా అనుకోకుండా.. సమంతను కలిసి కలిశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతుంది.నాని ముంబై వెళ్తూ సమంతని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలిసాడు. సమంత కూడా నాని వెళ్తున్న ఫ్లైట్ కే ముంబైకి వెళ్తుండటంతో ఇద్దరూ ఎయిర్ పోర్ట్ లో కలిసి ఫ్లైట్ వద్దకు వెళ్లారు. నాని, సమంత కలిసి నడుస్తున్న వీడియో, బస్ లో ఫ్లైట్ వద్దకు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సమంత కూడా ప్రస్తుతం బాలీవుడ్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టడంతో ముంబైకి, ఇక్కడికి ట్రావెల్ చేస్తుంది.నాని, సమంత కలిసి గతంలో నటించిన సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత ఈ ఇద్దరూ ఇలా కలిసి సరదాగా మాట్లాడుకోవడం, ఆ వీడియోలు వైరల్ అవుతుండటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. తాజాగా  సరిపోదా శనివారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. దీంతో నాని ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ మూవీని థియేటర్స్ లో చూద్దమనని తెగ వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ  మూవీలో ఎస్‌జే సూర్య కూడా కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: