రామ్‌ హీరోగా వచ్చిన ‘దేవదాసు’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది ఇలియానా.ఈ సినిమాలో తన పెర్‌ఫార్మెన్స్‌తో ‘పోకిరి’లో మహేష్‌ తో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌ అవ్వడంతో రెండో సినిమాతోనే స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. ఆ తర్వాత వరస అవకాశాలతో బిజీ హీరోయిన్‌ అయిపోయింది. తెలుగు, తమిళ్‌, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 30 సినిమాల్లో నటించింది. టాలీవుడ్‌లోని టాప్‌ హీరోల సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. 2014 వరకు ఇండియన్‌గా ఉన్న ఇలియానా.. 2014 నుంచి పోర్చుగీస్‌ పౌరసత్యం తీసుకుంది. 2023లో మైఖేల్‌ డోలన్‌ను వివాహం చేసుకుంది. వీరికి 2023లోనే ఓ బాబు పుట్టాడు. ఇదిలా ఉంటే.. ఇలియానాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో తన సినీ జీవితంలో ఎదురైన కొన్ని చేదు అనుభవాలను వివరించింది.నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొంతమంది నేనూ  లైంగిక వేధింపులకు గురి అయ్యాను.అందులో కొంత మంది తెలుగు దర్శకులు కూడా ఉన్నారు.  

డైరెక్టర్ కోరిక తీర్చమని పట్టుపడుతూంటే నేను ఇంటికి వచ్చి సూసైడ్ చేసుకోవాలి అనుకున్నాను. అయితే ఫ్యామిలీ గుర్తుకు వచ్చి ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయాన్ని విరమించుకున్నానని ఇలియానా వెల్లడించింది.అలాగే ఎవరో మూర్ఖుడు గురించి నేను ఎందుకు చనిపోవాలని అనుకున్నానని, అందుకే ఆత్మహత్య చేసుకోలేదని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఇలియానాడైరెక్టర్ పేరు మాత్రం బయట పెట్టలేదు. ఇలియానా మాటలు విన్నా ఆమె అభిమానులు ఇంతకీ ఇలియానాని లైంగికంగా ఇబ్బంది పెట్టిన ఆ తెలుగు డైరెక్టర్ ఎవరూ అని కామెంట్స్ పెడుతున్నారు.ఇక ఇలియానా తెలుగులో చివరగా కనిపించి చాలా కాలమే అవుతోంది. అమర్ అక్బర్ ఆంటోని చివరి చిత్రం. అల్లు అర్జున్ తో చేసిన  జులాయ్ తరువాత అసలు ఇలియానాకు హిట్టు అన్నదే రాలేదు. కిక్ 2 కూడా దారుణంగా ఫ్లాప్ అయింది. రవితేజతో చేసిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. ఖతర్నాక్, దేవుడు చేసిన మనుషులు, కిక్ 2, అమర్ అక్బర్ ఆంటోని ఇలా అన్నీ డిజాస్టర్లు అయ్యాయి. ఒక్క కిక్ మాత్రమే బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.  బాలీవుడ్‌లో వచ్చాక ఏమైనా హిట్ వచ్చిందా? అంటే అది లేదు. దాంతో గత కొంతకాలంగా ఖాళీగా ఉంటోంది ఇలియానా.

మరింత సమాచారం తెలుసుకోండి: