టాలీవుడ్లో వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వని దత్ , చిరంజీవి బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన చాలా చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నాయి. అందులో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా గురించి ఇప్పటికీ చర్చించుకుంటూ నే ఉంటారు. 1990లో వచ్చిన ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్తో మంచి విజయాన్ని అందుకుంది. శ్రీదేవి గ్లామర్ తో పాటు డైరెక్టర్ రాఘవేందర్ రావు దర్శకత్వము అమ్రిష్ పూరి విల్లనిజం బడ్జెట్లలో కూడా మంచి క్రేజ్ అందుకుంది.


ఆ తర్వాత వీరి బ్యానర్ లోనే చూడాలని ఉంది అనే సినిమాని గుణశేఖర్ తెరకెక్కించారు. ఈ సినిమా కూడా అప్పట్లో రికార్డు బద్దలు కొట్టింది. పాటలు కూడా ఇప్పటికి బెస్ట్ ఆల్బమ్ గా నిలిచాయి. ఈ చిత్రంతోనే నటుడు ప్రకాష్ రాజుకు మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఇంద్ర సినిమాను కూడా తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. నాలుగో సినిమాగా వచ్చిన జై చిరంజీవ సినిమా మాత్రం ఒక మోస్తారుగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి విజయభాస్కర్ దర్శకత్వం వహించగా రచన త్రివిక్రమ్ అందించారట.



పాటలు డాన్స్ సెంటిమెంట్స్ వగైరా అన్ని బాగానే కుదిరిన బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం మ్యాజిక్ చేయలేకపోయింది. ఇలాంటి సమయంలోనే మళ్లీ ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత త్వరలోనే చిరంజీవితో ఐదో సినిమా తీస్తానంటూ అశ్వని దత్ ప్రకటించారు. నిన్నటి రోజున చిరంజీవి బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వీడియోల శుభవార్త చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే అందుకు సంబంధించి డైరెక్టర్ ఎవరు కథ ఏంటి అనే విషయం పైన మాత్రం తెలియజేయలేదు. ప్రస్తుతమైతే కల్కి 2898AD చిత్రాన్ని మాత్రమే పాన్ ఇండియా లేవల్లే తెరకెక్కిస్తున్నారు. మెగా అభిమానులు కూడా ఇలాంటి సినిమానే తమ హీరోతో తెరకెక్కించేలా ప్లాన్ చేయండి దత్తు గారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: