ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు హీరోలు తమ పర్సనల్ విషయాలను వీలైనంతవరకు రహస్యంగా ఉంచుతున్నారు. అయితే చాలా రోజులు డేటింగ్ చేసిన తర్వాత ఎన్ని రూమర్స్ వినిపించినా కూడా వాటిపై క్లారిటీ ఇవ్వకుండా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. ఇక రీసెంట్గా నాగచైతన్య శోభితలు కూడా సీక్రెట్ గా వెకేషన్ లకి వెళ్లడం, కలుసుకోవడం వంటివి చేశారు. కానీ ఒక్కసారిగా వీరిద్దరి మధ్య ఉన్న న్యూస్ ఆఫీషియల్ గా బయటపడటంతో అందరూ షాక్ అయిపోయారు. అయితే తాజాగా మరో హీరోయిన్ కూడా పెళ్లికి రెడీ అయిపోయినట్టు తెలుస్తుంది.అయితే గత కొద్ది రోజులుగా హీరోయిన్ పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపించినప్పటికీ వాటిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే సడన్గా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది.

ఇక ఆమె ఎవరో కాదు నితిన్ తో లై మూవీలో నటించిన హీరోయిన్ మేఘా ఆకాష్.. ఛల్ మోహన్ రంగా, లై,రాజరాజ చోర, రావణాసుర, గుర్తుందా శీతాకాలం, డియర్ మేఘ వంటి తెలుగు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ చివరగా తెలుగులో రావణాసుర మూవీలో కనిపించింది. అయితే గత కొద్ది రోజులుగా అవకాశాలు లేకపోవడంతో  ఈ హీరోయిన్ ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంది.అయితే తాజాగా ఈ హీరొయిన్ కి సంబంధించి ఎంగేజ్మెంట్ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక గత కొద్ది రోజులుగా ఈ హీరోయిన్ బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకోబోతుందని, రాజకీయ నాయకుడి కొడుకుని పెళ్లి చేసుకోబోతుందని రూమర్స్ వినిపించినప్పటికీ అవన్నీ తోసిబుచ్చుతూ సాయి విష్ణు అనే అబ్బాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫొటోస్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ హీరోయిన్ తన ఎంగేజ్మెంట్ ఫొటోస్ ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది. అయితే మేఘ ఆకాష్ పెళ్లి చేసుకోబోయే సాయి విష్ణు ఎవరు ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి అనేది మాత్రం ఇంకా బయటపడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: