బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఊర్వశి ఫ్యాషన్ ట్రెండ్ కు పెట్టింది పేరు. ఆమె ధరించే దుస్తులే ఆమె ఫ్యాషన్ ను తెలియజేస్తాయి. మొదట మోడలింగ్ లో తన కెరియర్ ప్రారంభించిన ఊర్వశి రౌతేలా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. సినిమా ఫంక్షన్లు, ఫ్యాషన్ షోలు వైవిద్యమైన డ్రెస్ లలో మెరుస్తూ ఉంటుంది. వాల్తేరు వీరయ్య, ఏజెంట్, బ్రో, స్కంద సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరిసింది బాలీవుడ్ భామ ఊర్వశి.


భామ తొలిసారి టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ఎన్.బి.కె 109లో తొలిసారి ఫిమేల్ లీడ్ రోల్ లో కూడా నటిస్తోంది. ఈ సినిమాను బాబి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్ పైన ఉండగానే ఊర్వశి రౌతేలా తెలుగులో మరో సినిమాకు ఓకే చేసిందన్న వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఊర్వశి కొత్త ప్రాజెక్ట్ బాబి డైరెక్షన్ లోనే చేయబోతుందనే వార్త నెట్టింట్లో షికార్లు కొడుతోంది.

మాస్ మహారాజా రవితేజ ప్రజల మనిషి అనే టైటిల్ తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కు సైన్ చేశాడని ఇప్పటికే ఓ అప్డేట్ తెరపైకి వచ్చింది. ఈ హై వోల్టేజ్ ఎంటర్టైనర్ లో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఊర్వశి వన్ ఆఫ్ ది ఫిమేల్ లీడ్ రోల్ లో కనిపించబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ఇక ఊర్వశితో పాటు డింపుల్ హయాతి కూడా హీరోయిన్గా నటించనుంది. లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కించనున్న ఈ సినిమా 2024 చివరి వరకు సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.

ఇదిలా ఉండగా.... తాజాగా ఊర్వశి ఆస్పత్రిలో చేరిందట. ఆమె చేతికి చిన్న గాయం కావడంతో ట్రీట్మెంట్ కోసం వెళ్లిందట. ఈ విషయాన్ని ఊర్వశే సోషల్ మీడియలో పెట్టింది. అయితే దీనిపై ఉమైర్ సందు సంచలన పోస్ట్ చేశారు. బాలీవుడ్ నటి ఊర్వసి ప్రెగ్నెంట్ అని.... అబార్షన్ చేయించుకోవడం కోసమే ఆసుపత్రికి వెళ్లిందని పోస్ట్ చేశాడు. చేతికి గాయం అని అందరికీ చెప్పి... అబార్షన్ చేయించుకుంటుందని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. కాగా పంత్‌ కారణంగా ఊర్వశి ప్రెగ్నెంట్‌ అయిందని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: