ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా కొనసాగిన ప్రభాస్ ఇక ఇప్పుడు ఆలిండియా సూపర్ స్టార్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత కాలంలో ప్రభాస్ నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే కేవలం తెలుగులో ఫ్లాప్ అయిన సినిమాలు అటు బాలీవుడ్ లో మాత్రం సూపర్ హిట్ సాధించాయి అని చెప్పాలి. దీంతో ఇక అక్కడ క్రేజ్ ప్రభాస్ అంతకంతకు పెరుగుతూనే వచ్చింది.


 అయితే ఇలా వరుస ప్లాపులతో సతమతమైన ప్రభాస్ అటు సలార్ సినిమాతో సాలిడ్ హిట్టు కొట్టి మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసాడు. మొన్నటికి మొన్న కలిపి 2898 సినిమాతో ఏకంగా 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుని అటు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు ప్రభాస్. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ప్రభాస్ ది. ఇక వివాదాలకు దూరంగా ఉండే ప్రభాస్ చుట్టూ మాత్రం ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. మరి ముఖ్యంగా ప్రభాస్ క్రేజ్ చూసి బాలీవుడ్ వాళ్లు ఓర్వలేకపోతు ఉంటారు. ఈ క్రమంలోనే ప్రభాస్ లుక్ యాక్టింగ్ పైన కూడా విమర్శలు చేయడం చేస్తూ ఉంటారు


 ఇటీవల బాలీవుడ్ నటుడు అర్షద్ వార్షి కల్కి సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ జోకర్లా ఉంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అదే సమయంలో ఇక అశ్వద్ధామ పాత్రలో నటించిన అమితాబ్ నటనపై ప్రశంసలు కురిపించాడు. అయితే ఈ విషయంపై స్పందించిన టాలీవుడ్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్రభాస్ సక్సెస్ ని ఇమేజ్ ని చూసి భరించలేని వారే ఇలాంటి విమర్శలు చేస్తారు అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇక ఇదే విషయంపై హీరో సుధీర్ బాబు, సిద్దు జొన్నలగడ్డ, హీరో నాని కూడా కౌంటర్ ఇచ్చారు. ఇలా ఒక వైపు ప్రభాస్ సైలెంట్ గా ఉండి.. తన పని తాను చేసుకుంటుంటే ప్రభాస్ చుట్టూ మాత్రం కౌంటర్లు ప్రతి కౌంటర్లతో రచ్చ రచ్చ జరుగుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: