మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొంది అద్భుతమైన విజయం సాధించిన సినిమాలలో ఇంద్ర మూవీ ఒకటి. ఈ మూవీ కి బి గోపాల్ దర్శకత్వం వహించగా ... వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ సినిమాను నిర్మించాడు. ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే ఈ సినిమాలో హీరోయిన్ లుగా నటించగా ... మణిశర్మమూవీ కి సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఆల్ టైం టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇకపోతే అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను నిన్న అనగా ఆగస్టు 22 వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా వైజయంతి మూవీస్ బ్యానర్ గారు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు రీ రిలీస్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. అలా రీ రిలీస్ అయిన సినిమాలలో ఇంద్ర సినిమా సరికొత్త రికార్డు ను సృష్టించింది.

రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక , తమిళనాడు ప్రాంతాలలో కలిపి దాదాపు 385 కు పైగా థియేటర్ లలో రిలీజ్ అయింది. ఇప్పటి దాకా ఏ హీరో సినిమా కూడా ఇన్ని థియేటర్ లలో రీ రిలీజ్ విడుదల కాలేదు. ఈ విషయాన్ని ఈ మూవీ నిర్మాణ సంస్థ అయినటువంటి వైజయంతి మూవీస్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో చిరంజీవి ఇంద్ర మూవీ రీ రిలీజ్ విషయంలో ఒక కొత్త రికార్డును సృష్టించాడు  ఇకపోతే ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు అదిరిపోయే సూపర్ సాలిడ్ కలెక్షన్ లు కూడా దక్కినట్లు తెలుస్తోంది. మరి రీ రిలీజ్ లో భాగంగా ఇంద్ర సినిమా ఆ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసి ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: