తెలుగు సినీ పరిశ్రమలోకి చాలా మంది దర్శకులు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తూ ఉన్నారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే దర్శకత్వం వహించిన మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ను సంపాదించుకోవడం మాత్రమే కాకుండా ఆ తర్వాత కూడా అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలకు దర్శకత్వం వహిస్తూ వస్తున్నారు. అలాంటి వారిలో మల్లాడి వశిష్ట ఒకరు. ఈయన కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన బింబిసారా అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు.

మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాతో ఈ దర్శకుడికి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ఈ మూవీ తర్వాత ఈయనకు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందబోయే సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఈ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా విశ్వంభర అనే సినిమాను రూపొందిస్తున్నాడు. త్రిష ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇకపోతే నిన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు అనే విషయం మనకు తెలిసిందే. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న మల్లాడి వశిష్ట "విశ్వంబర" సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ఇచ్చాడు. మల్లాడి వశిష్ట తాజాగా మాట్లాడుతూ ... విశ్వంబర మూవీ అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది. చిరంజీవి గారిని ఎలా చూడాలి అనుకుంటున్నారో అదే స్థాయిలో ఆయన ఈ సినిమాలో కనిపిస్తాడు. ఈ సారి సంక్రాంతి మనదే. బ్లాక్ బాస్టర్ కొడుతున్నాం అని చెప్పుకొచ్చాడు. ఈయన ఇలా చెప్పడంతో మెగా అభిమానులు ప్రస్తుతం ఫుల్ ఖుషి అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: