బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ "కల్కి 2898 AD" సినిమాపై కాంట్రవర్షల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అందులోని హీరోలు బాగోలేదు అంటూ అతను ప్రభాస్‌ను "జోకర్" అని పిలిచాడు. దీనివల్ల టాలీవుడ్ ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు చేస్తూ అర్షద్ పై విరుచుకుపడుతున్నారు. అలానే ఆన్‌లైన్‌లో ప్రభాస్‌కు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఈ క్రమంలోనే ఒక తెలుగు జర్నలిస్ట్ ఈ విషయంపై నేచురల్ స్టార్ నానిని దీని గురించి ప్రశ్నించాడు. దానికి హీరో నాని సమాధానం చెబుతూ "మీరు చెబుతున్న వ్యక్తి తన జీవితంలో ఇప్పటివరకు పొందని అత్యంత ప్రచారం పొందుతున్నాడు." అని అన్నాడు.

 నాని చేసిన కామెంట్ సౌత్, నార్త్ మూవీ ఫ్యాన్స్ మధ్య పెద్ద సోషల్ మీడియా వార్ కి దారి తీసింది. అర్షద్ వార్సి చేసిన కామెంట్ ప్రభాస్ పాత్రను రాసిన విధానం గురించి కానీ అతనిపై వ్యక్తిగత దాడి కాదని ఉత్తర భారత అభిమానులు వాదిస్తున్నారు. నాని రియాక్షన్ రెండు ప్రాంతాల అభిమానుల మధ్య పెద్ద ఆన్‌లైన్ ఫైట్‌కు దారి తీసింది. పెరుగుతున్న ఈ మాటల యుద్ధాన్ని నానిగా తెలుసుకున్నాడు. అందుకే నాని తరువాత మిడ్‌డే వెబ్‌సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్షద్ వ్యాఖ్యలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే విన్నానని, పెద్దగా ఆలోచించకుండా దానిపై రియాక్ట్ అయ్యానని వివరించాడు.  

ఇంతకుముందు చేసిన కామెంట్ బాగోలేదని, మరింత జాగ్రత్తగా పాటలు ఎంచుకుని ఉండే బాగుండేదని అతను తెలిపాడు. పూర్తి వీడియో చూసిన తర్వాత, నాని తప్పు చేశానని గ్రహించి, అతని అభిప్రాయం మార్చుకున్నాడు. నాని సాధారణంగా మాటలు జారడు. జాగ్రత్తగా ఉంటాడు, కానీ ఈసారి అనవసరంగా కాంట్రవర్సీలో వేలు పెట్టినట్లు అయింది. అందుకు  లెంపలేసుకున్నాడు, ఇక ఈ హీరో "సరిపోదా శనివారం" సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానున్నాడు.

ఈ విజిలెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేశాడు. ఇందులో ఎస్జే.సూర్య, ప్రియాంక మోహన్, అభిరామి, అదితి బాలన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 29న రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంత బాగా ఆలోచిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: