తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న ముద్దుగుమ్మలలో మీనాక్షి చౌదరి , భాగ్య శ్రీ బోర్స్ ముందు వరసలో ఉన్నారు. మీనాక్షి చౌదరి సుశాంత్ హీరోగా రూపొందిన ఇచట వాహనములు నిలపరాదు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. మోడలింగ్ రంగం నుండి సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ మొదటి సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ కి వరస అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఈమె ఈచట వాహనంలో నిలపరాదు మూవీ తర్వాత కిలాడి సినిమాలో హీరోయిన్గా నటించింది. 

మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఇందులో ఈమె తన అందాలను భారీగా ఆరబోసింది. ఇకపోతే ఈమెకు తెలుగులో మొదటి విజయం అడవి శేషు హీరోగా స్టైలిష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ ది సెకండ్ కేస్ మూవీ తో లభించింది. ప్రస్తుతం ఈమె చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. ఈమె ప్రస్తుతం వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే లక్కీ భాస్కర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తలపతి విజయ్ హీరోగా రూపొందుతున్న గోట్ అనే తమిళ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

మరికొన్ని సినిమాలు కూడా ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్నాయి. ఇకపోతే మిస్టర్ బచ్చన్ మూవీ తో భాగ్య శ్రీ బోర్స్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది. ఈ సినిమా విడుదల కాకముందే ఈమెకు విజయ్ దేవరకొండ హీరోగా రూపొందబోయే ఓ సినిమాలోను , దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందబోయే ఓ సినిమాలోను అవకాశాలు దక్కాయి. ఇక మిస్టర్ బచ్చన్ మూవీ లో ఈమె అందాలతో భారీగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈమెకు మరికొన్ని అవకాశాలు దక్కే ఛాన్స్ చాలా వరకు ఉన్నట్లు జనాలు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: