నాని హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం ఈ నెల 29 వ తేదీన విడుదల కానుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా, ఎస్ జే సూర్య విలన్ పాత్రలో నటించాడు. సినిమా రిలీజ్ కి దగ్గర పడుతున్న నేపథ్యంలో టీమ్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. అందులో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ముందు ఇప్పుడొక టార్గెట్ ఉంది. నాచురల్ స్టార్ నాని తన దసరా మూవీతో తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు 24.85 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్నాడు. టైర్ 2 హీరోలలో అత్యధిక ఓపెనింగ్స్

 అందుకున్న హీరోగా నాని దసరాతో రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ ని వేరే టైర్ 2 హీరోలు ఎవరూ కూడా టచ్ చేయలేకపోయారు. విజయ్ దేవరకొండ ఖుషి, ది ఫ్యామిలీ స్టార్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ రెండు దసరా రికార్డ్ దరిదాపుల్లోకి రాలేదు.  రామ్ పోతినేని స్కంద, డబుల్ ఇస్మార్ట్ లతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కానీ ఈ రికార్డ్ ని టచ్ చేయలేకపోయాడు. మాస్ మహారాజ్ రవితేజ కూడా ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలతో దసరా ఓపెనింగ్ డే కలెక్షన్స్ ని తాకలేకపోయాడు. ఇప్పుడు మరల నానికి ఆ అవకాశం వచ్చింది. సరిపోదా శనివారం సినిమాపై ఉన్న హైప్ బట్టి అయితే ఈ రికార్డ్ ని బ్రేక్

 చేయడానికి కావాల్సినంత స్కోప్ ఉంది. ఇక ఈ విషయం పక్కన పెడితే డిఫరెంట్ కాన్సెప్ట్ తో మాస్ యాక్షన్ జోనర్ లో సరిపోదా శనివారం మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతోందని అర్ధమవుతోంది.  ఎస్.జె.సూర్య లాంటి విలక్షణ నటుడితో నాని ఈ సినిమాలో పోటీ పడుతున్నాడు. ఈ మధ్య ఎస్.జె.సూర్య విలన్ పాత్రలలో నటించిన సినిమాలు ఎక్కువగా సక్సెస్ అయ్యాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: