తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్‌లో పార్టిసిపేట్ చేస్తే చాలా గుర్తింపు వస్తుంది అని ఇంతకుముందు అనుకునేవారు. కానీ ఇప్పుడు హౌజ్‌లో అడుగుపెడితే ఉన్న మంచి పేరు కాస్త చెడిపోతుంది అని కొందరు భావిస్తున్నారు. బిగ్ బాస్ యాజమాన్యం టీఆర్పీ రేటింగ్ కోసం కంటెస్టెంట్ల చేత చాలా చెత్త పనులు చేయిస్తోంది. అనవసరంగా కొట్టుకునే లాగా ప్రోత్సహిస్తోంది. దీనివల్ల కంటెస్టెంట్ల క్యారెక్టర్ పై ఒక చెడు ఇంప్రెషన్ అనేది వస్తోంది. అందుకే చాలామంది ఇందులోకి రావడానికి సిద్ధపడటం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. చాలామంది ఈ ఆఫర్ రిజెక్ట్ చేయడానికి కూడా అదే కారణమని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే మొగలిరేకులు సీరియల్ యాక్టర్ బిగ్‌బాస్ ఆఫర్ రిజెక్ట్ చేశాడని ప్రచారం జరుగుతోంది. బిగ్‌బాస్ 8వ సీజన్ సెప్టెంబర్ ఒకటవ తేదీన ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చాలామంది కంటెస్టెంట్ల పేర్లు వినిపిస్తున్నాయి. సెలెక్షన్ ఇంటర్వ్యూలు కంప్లీట్ అయ్యాయని, హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవ్వండి అంటూ బీబీ యాజమాన్యం కొందరికి కాల్స్ కూడా చేసిందని సమాచారం. వీరిలో రీతూ చౌదరి, విష్ణుప్రియ, నటి సోనియా సింగ్, ఆలీ తమ్ముడు ఖయ్యూం, సీరియల్ నటి అంజలి పవన్, బెజవాడ బేబక్క, సీరియల్ నటి యాష్మి గౌడ, మోడల్ ఊర్మిళ చౌహన్, అభిరామ్ వర్మ ఉన్నట్లు టాక్ నడుస్తోంది.

అలానే ‘చక్రవాకం’, మొగలి రేకులు సీరియల్స్ నటుడు ఇంద్రనీల్ ను కూడా తీసుకొచ్చేందుకు బిగ్ బాస్ టీం చాలా ప్రయత్నించిందట. ఇంద్రనీల్ కూడా ఇందులో పాటిస్పేట్ చేసేందుకు మొగ్గు చూపాడట. అయితే లాస్ట్ మినిట్ లో నో చెప్పాడని టాక్. దానంతటికీ కారణం అతడి భార్య మేఘన అని అంటున్నారు. ఈ హౌస్ లోకి అడుగుపెడితే పాజిటివ్ ఇమేజ్ కాస్త పోయి నెగటివ్ ఇమేజ్ ఏర్పడుతుందని ఆమె ఇంద్రనీల్‌కు చెప్పిందట.

 "ఈ హౌస్ లో అడుగు పెట్టి బయటకు వచ్చిన వారెవరికీ కూడా సినిమా అవకాశాలు గానీ సీరియల్ అవకాశాలు గానీ రాలేదు. ఇందులో పాటిస్పేట్ చేస్తే ఉన్న అవకాశాలు కూడా పోవడం ఖాయం. అందుకే నువ్వు వెళ్లొద్దు" అన్నట్టు మేఘన తన భర్త ఇంద్రనీల్‌తో వాదించిందట. దాంతో ఆయన లాస్ట్ మినిట్ లో డ్రాప్ అయ్యాడని వార్తలు వస్తున్నాయి. అయితే సోనియా, విష్ణుప్రియ అలాంటి వారితో ఈసారి బిగ్ బాస్ హౌస్ బాగానే సందడిగా ఉంటుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: