యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు మాస్ ఈమేజ్ ను తెచ్చి పెట్టిన సినిమా ఆది. ఈ మూవీ తో జూనియర్ ఎన్టీఆర్ కి మాస్ అభిమానుల్లో అద్భుతమైన గుర్తింపు ఏర్పడింది. ఈ మూవీ లో ఎన్టీఆర్ కి జోడిగా కీర్తి చావ్లా నటించగా ... వి వి వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో ఎన్టీఆర్ , కీర్తి చావ్లా , వి వి వినాయక్ కి తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ లభించింది. ఇకపోతే ఈ మూవీ ద్వారా పెద్ద మొత్తంలో లాభాలు కూడా వచ్చాయి.

సినిమా మూడు సెంటర్ లలో 175 రోజులు ప్రదర్శించబడగా , 96 సెంటర్ లలో 100 రోజులు ప్రదర్శించబడింది. ఇక 121 సెంటర్ లలో ఈ మూవీ 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇకపోతే ఈ మూవీ ని కేవలం 2 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందించగా ఈ సినిమా ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 25 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. అలా 2 కోట్లతో రూపొందించబడిన ఈ సినిమా 25 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఆ సమయంలో అత్యంత భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసుకుంది.

ఆది సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ , వి వి వినాయక్ కాంబినేషన్లో సాంబ , అదుర్స్ సినిమాలు రూపొందాయి. ఇక ఇందులో సాంబ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అదుర్స్ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇక వి వి వినాయక్ ఆఖరుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెలుగు చత్రపతి మూవీ ని హిందీ లో రీమిక్ చేశాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: