కోలివుడ్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. జైలర్‌ లాంటి హిట్‌ సినిమా తర్వాత ఆయన మళ్ళీ ఆ రేంజ్‌లోనే  తన నెస్ట్  సినిమా ఉండాలని ఆయన ప్లాన్‌ చేస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ దసరా పండుగ  సందర్భంగా 'వేట్టైయాన్‌' సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.  ఈ సినిమాను టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తుండగా లైకాప్రోడక్షన్స్‌పై సుభాస్కరన్ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్‌తో పాటు కూలీ సినిమా కూడా తెరకెక్కిస్తున్నారు. అంతే కాకుండా జైలర్‌ సినిమాకి సీక్వెల్‌ కూడా ఉంది అని తెలుస్తుంది.

అయితే తాజాగా   రజనీకాంత్‌ మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారని తెలుస్తోంది. దళపతి విజయ్‌తో 'మాస్టర్' సినిమాతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు మారి సెల్వరాజ్, ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి కొత్త సినిమా చేయబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఈ కాంబినేషన్ సినిమా గురించి అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సెల్వరాజ్ ఇలా చెప్పుకొచ్చారు.....'రజనీకాంత్‌ గారికి నేను అంటే చాలా ఇష్టం. నేను డైరెక్ట్‌ చేసిన కర్ణన్‌, మామన్నన్‌ చిత్రాలను ఆయన చూసి అభినందించారు. ఆ సమయంలోనే ఒక సినిమా చేయాలని ఇద్దరం నిర్ణయించుకున్నాం.

 ఇప్పటికైతే కథ రెడీ అయింది. అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.' అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన అన్న మాటలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. కాగా ఈ సినిమా కథ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ, మారి సెల్వరాజ్ తన సినిమాల్లో సమాజంలోని వివిధ అంశాలను ప్రస్తావిస్తూ, కొత్త కథలను తెరకెక్కిస్తారనే విషయం తెలిసిందే. రజనీకాంత్‌తో కలిసి ఆయన ఎలాంటి కథను ఎంచుకున్నారనేది ఆసక్తికరంగా ఉంది. మారి సెల్వరాజ్ తన సినిమాల్లో కంటెంట్‌పై ఎక్కువ దృష్టి పెడతారు. రజనీకాంత్‌తో కలిసి ఆయన ఎలాంటి కంటెంట్‌ను తీసుకువస్తారనేది మీ   ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇకపోతే ప్రస్తుతం రజనీకాంత్ పాన్ ఇండియా వంటి సినిమాలతో బిజీ గా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: