పండుగలను సైతం సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా చాలా గ్రాండ్ గానే జరుపుకుంటూ ఉంటారు. కొంతమంది ఫోటోలను షేర్ చేసినప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాము. కొంతమంది చాలా సింపుల్ గానే చేసుకుంటూ ఉంటారు.అలా తెలుగు సినీ ఇండస్ట్రీలో  మెగా కుటుంబం ఎలాంటి పండుగల కైనా సరే చాలా సాంప్రదాయమైన పద్ధతిలో చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో ఫోటోలను కూడా షేర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం శ్రావణమాసం ,వరలక్ష్మి వ్రతం పూజ కూడా ఈ నెలలోనే జరిగాయి.


ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సాంప్రదాయాలకు పెద్దపీట వేసే మెగా ఫ్యామిలీలో పూజకు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా నిహారిక తల్లి పద్మజ వదిన లావణ్య త్రిపాఠితో కలిసి వరలక్ష్మి పూజ చేసినట్లుగా కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఇందులో నిహారిక తో పాటు ఆమె తల్లి అలాగే వదిన లావణ్య త్రిపాఠితో కలిసి ఈ పూజ చేసినట్లుగా తెలుస్తోంది.


వివాహమైన తర్వాత లావణ్య త్రిపాఠి కి తన అత్తగారింట్లో చేస్తున్న మొదటి వరలక్ష్మి వ్రతం అని చెప్పవచ్చు. ఈ పూజ మొత్తం చాలా సాంప్రదాయమైన పద్ధతిలో కట్టుబొట్టుతో చాలా సింపుల్ గానే లావణ్య త్రిపాఠి చేసింది. అంతేకాకుండా చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలిచి ఈ వరలక్ష్మీ వ్రతాన్ని చాలా గ్రాండ్ గా చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోటోలు చూసిన మెగా అభిమానులు సైతం వదిన మరదల్లు చూడ ముచ్చటగా కనిపిస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వివాహమైన తర్వాత లావణ్య త్రిపాఠి సినిమాలకు కూడా దూరంగానే ఉన్నది. ఇక వరుణ్ తేజ్ మాత్రం సినిమాలలో నటిస్తున్న సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నారు. నాగబాబు సినిమాలలో తక్కువగా నటిస్తున్నప్పటికీ తన తమ్ముడు పెట్టిన జనసేన పార్టీకి మాత్రం కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో నటిస్తుందేమో చూడాలి మెగా కోడలు.

మరింత సమాచారం తెలుసుకోండి: