డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో SSMB -29 చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఎన్నో పనులను సీక్రెట్ గా చేస్తూ ఉన్నారు డైరెక్టర్ రాజమౌళి. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి రాజమౌళి, మహేష్  అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గాని ఎదురుచూస్తున్నారు.RRR సినిమాతో ఆస్కార్ అవార్డుని సైతం టచ్ చేసిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో ఎలాంటి చిత్రాన్ని చేయబోతున్నారనే విషయం అందరిలో హైప్ పెంచేస్తోంది.SAMB -29 చిత్రానికి సంబంధించి ఇప్పటికీ ఎన్నో రకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.


తాజాగా ఇప్పుడు రాజమౌళి ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తోంది.. ఈ సినిమా స్టోరీ లైన్ గురించి కూడా విజయేంద్రప్రసాద్ గతంలో ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. అయితే అందుకు సంబంధించి లీకులు కూడా వైరల్ గా మారుతున్నాయి. వీటిపైన రాజమౌళి ఇప్పటివరకు ఏ విధమైనటువంటి క్లారిటీ ఇవ్వలేదు. వర్క్ షాప్ కూడా త్వరలోనే మొదలు కాబోతోందని ఈ సినిమాకు సంబంధించి అనౌన్స్మెంట్ కూడా ఎప్పుడు ఇవ్వాలని విషయం పైన పలు రకాల చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.


అయితే ఇప్పుడు తాజాగా SAMB -29; ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఫోటో వైరల్ గా మారుతోంది .అదేమిటంటే రెండు రెక్కలు కలిగే ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో ట్రెండీగా మారుతోంది.TP విజయం అని విజువల్ డెవలప్మెంట్ ఆర్టిస్ట్ ఈ చిత్రం కోసం పనిచేస్తున్నాడట. గతంలో కూడా ఈ ఆర్టిస్ట్ బాహుబలి, rrr వంటి చిత్రాలకు కూడా పని చేసినట్లుగా తెలుస్తోంది. ఇవే కాకుండా సలార్ , కల్కి ఇతర ఇతర సినిమాలకు కూడా పని చేసినట్లు సమాచారం. ఇతడు సోషల్ మీడియాలో రెండు గోల్డెన్ రెక్కలు కలిగిన ఆర్ట్ వర్క్ ని సైతం హైలెట్ చేయడం జరిగింది.. దీనికి SSMB -29 డైరీస్ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ను కూడా వైరల్ గా చేస్తారు. దీంతో ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబును ఏ విధంగా చూపిస్తారో అన్నట్టుగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా రాజమౌళి ఎలాంటి ప్లాన్ వేసినా కూడా అది అదుర్స్ అనిపించేలా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: