అక్కినేని నాగార్జున కుమారుడు నాగచైతన్య ఆగస్టు 8వ తేదీన శోభిత ధూళిపాళతో ఎంగేజ్మెంట్ జరుపుకున్నాడు. ఆరు నెలల గ్యాప్ తర్వాత వివాహం చేయాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఇక వీరి ఎంగేజ్మెంట్ నాగార్జున ఇంట్లో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిపించారు. ఈ ఎంగేజ్మెంట్ కు అమెరికాలో ఉన్న నాగచైతన్య తల్లి దగ్గుబాటి లక్ష్మి రాలేకపోయారు.


దానికి గల కారణం ఆమెకు నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని... సమంతకు విడాకులు ఇవ్వడం అసలు ఇష్టం లేదంటూ జాతీయ మీడియా ఓ కథనాన్ని ప్రచారం చేసింది. ఆ సంస్థ నాగచైతన్య ఎంగేజ్మెంట్ పై ప్రసారం చేసిన కథనం ఇప్పుడు సంచలనాలను సృష్టిస్తోంది. దగ్గుబాటి రామానాయుడు కుమార్తె వెంకటేష్ సోదరి అయిన లక్ష్మీని నాగార్జున పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత ఏవో కారణాలతో ఇద్దరూ విడిపోయారు. లక్ష్మీ నాగచైతన్యకు తీసుకొని అమెరికాలో స్థిరపడ్డారు.


నాగచైతన్య సమంతను పెళ్లి చేసుకోవడం ఆమెకు చాలా ఇష్టం. అంతేకాదు ఆమె సమంతను బాగా ఇష్టపడుతుంది. విడాకులు తీసుకుని శోభితతో ఎంగేజ్మెంట్ జరుపుకున్నప్పటికీ సమంతతో దగ్గుబాటి లక్ష్మి ఇప్పటికీ మాట్లాడుతున్నారట. సమంతను ఆమె తన కోడలిగా మనస్ఫూర్తిగా ఇష్టపడిందని, అందుకే రీసెంట్గా జరిగిన ఎంగేజ్మెంట్ కు హాజరు కాలేదని పేర్కొన్నారు.


సమంతకు మయోసైటిస్ వ్యాధి సోకినప్పుడు లక్ష్మి ఎంతో బాధ పడిందట. ఎప్పటి కప్పుడు సమంత బాగోగులను ఫోన్ చేసి తెలుసుకునేదని టాక్. సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్యతో మాట్లాడడం కాస్త తగ్గించిందట లక్ష్మి. ఇక జరగ బోయే పెళ్లికైనా లక్ష్మి వస్తుందా లేదా అనే సందేహం ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. ఇది ఇలా  ఉంండగా... అక్కినేని నాగార్జున కుమారుడు నాగచైతన్య, శోభిత ధూళిపాళతో పెళ్లి ఇటలీలో జరుగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో నాగచైతన్య, శోభిత ధూళిపాళతో పెళ్లి జరుగనుందని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: