ప్ర‌భాస్‌, డైరెక్ట‌ర్ సందీప్ వంగా కాంబినేష‌న్‌లో రాబోతోన్న స్పిరిట్ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.కల్కి రిలీజ్ తర్వాత ప్రభాస్ ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్ లో పాల్గొనలేదు. హను రాఘవపుడితో ప్రభాస్ చేయబోయే సినిమాకు ఈమధ్యనే పూజా కార్యక్రమాలు జరిగాయి. దానితో పాటు యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తో కూడా ప్రభాస్ చేయాలనుకున్న స్పిరిట్ కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. సో మళ్లీ అటు హను సినిమా.. ఇటు సందీప్ రెడ్డి సినిమా రెండిటికీ ఒకేసారి వర్క్ చేయనున్నాడు ప్రభాస్.అలా రెండు పార్లర్ గా ప్లాన్ చేయడం వల్ల సినిమాలు రిలీజ్ కూడా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఐతే స్పిరిట్ సినిమా నుంచి లేటెస్ట్ గా ఒక న్యూస్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. స్పిరిట్ లో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ గా కనిపిస్తాడని తెలిసిందే. ఐతే సినిమాలో విలన్ గా కూడా ప్రభాస్ కనిపిస్తాడట. అంటే ప్రభాస్ డ్యుయల్ రోల్ లో హీరో అతనే విలన్ కూడా తనే అయ్యేలా ప్లాన్ చేశాడట సందీప్. సినిమాలో హీరోయిన్ గా త్రిష ని ఫైనల్ చేయగా ఆమె కూడా నెగిటివ్ రోల్ లో కనిపిస్తుందని అంటున్నారు.

ప్రభాస్ త్రిష ఈ జోడీ గురించి ఎంత చెప్పినా తక్కువే. వర్షం తో సూపర్ హిట్ అందుకున్న ఈ జంట ఆ తర్వాత పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాల్లో కూడా నటించారు. ప్రభాస్ తో దాదాపు త్రిష 16 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. సూపర్ హిట్ పెయిర్ కాబట్టి సందీప్ స్పిరిట్ కి ఈ కాంబినేషన్ కూడా కలిసి వచ్చేలా ఉంది. యానిమల్ తో బాలీవుడ్ ని షేక్ చేసిన సందీప్ వంగ స్పిరిట్ తో నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో వస్తున్నాడని తెలుస్తుంది.స్పిరిట్ మూవీని పాన్ ఇండియా గా కాకుండా పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా తెర‌కెక్కించేందుకు సందీప్ వంగా ప్లాన్ చేస్తోన్న‌ట్లు స‌మాచారం. ఈ యాక్ష‌న్ మూవీని ఇండియ‌న్ భాష‌ల‌తో పాటు కొరియ‌న్‌, చైనీస్ భాష‌ల్లోకి డ‌బ్ చేసే రిలీజ్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.స్పిరిట్‌తో పాటు రాజాసాబ్‌, స‌లార్‌2తో పాటు హ‌ను రాఘ‌వ‌పూడితో ఓ ల‌వ్ స్టోరీ చేస్తోన్నాడు ప్ర‌భాస్‌. ఇందులో రాజా సాబ్ మూవీ ఈ ఏడాది చివ‌ర‌లో రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం. సూప‌ర్ నాచుర‌ల్ హార‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: