హీరోయిన్ ఇప్పటికే ఎంతోమంది అబ్బాయిలతో ఎఫైర్లు పెట్టుకుంది.. ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని ఆయనతో డేటింగ్ చేసి కొడుకును కూడా కన్నది.చివరికి ఆయనతో బ్రేకప్ చెప్పుకొని కొడుకుని తనతో తీసుకొని వచ్చింది. ఇక ఆయనతో బ్రేకప్ తర్వాత మరో వ్యక్తితో ప్రేమలో పడింది.ప్రస్తుతం ఆ వ్యక్తితో పెళ్లికి రెడీ అయింది. ఇక ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు ఎవడు మూవీలో రామ్ చరణ్ సరసన నటించిన అమీ జాక్సన్..  ఈ ముద్దుగుమ్మ రజినీకాంత్ రోబో మూవీ లో లేడీ రోబోలా నటించింది. అలాగే విక్రమ్ హీరోగా చేసిన ఐ మూవీ లో హీరోయిన్ గా చేసింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా పెళ్లి చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాకు ఖాతా ద్వారా గుడ్ న్యూస్ చెప్పింది.ఇక విషయంలోకి వెళ్తే.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రాణించిన అమీ జాక్సన్ మొదట బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ తో డేటింగ్ చేసి బాలీవుడ్ లో హైలెట్ అయింది.

ఇక వీరి ప్రేమాయణం ఎంతలా అంటే పెళ్లి వరకు వెళ్లే అంత పీకల్లోతు వరకు వెళ్లిపోయారు. కానీ సడన్ గా ఈ జంట విడిపోయారు.ఇక ప్రతీక్ బబ్బర్ తో బ్రేకప్ చెప్పుకున్నాక లండన్ లోని ఫేమస్ బిజినెస్ మాన్ కొడుకు జార్జి పనాయుటూతో ప్రేమలో పడింది.ఇక వీరిద్దరూ చాలా రోజుల సహజీవనం చేసి పెళ్లి చేసుకుందామనే ఉద్దేశంతో ఒక బాబుకి కూడా జన్మనిచ్చింది. ఇక బాబు పుట్టాక ఏమైందో ఏమో తెలియదు కానీ వీరి మధ్య కూడా బ్రేకప్ జరిగింది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అమెరికన్ ఫేమస్ వెబ్ సిరీస్ అయినటువంటి గాసిప్ గర్ల్ నటుడు ఎడ్ వెస్ట్ విక్ తో డేటింగ్ లో ఉంది.

వీరిద్దరూ రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ కార్యక్రమం కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఎడ్ వెస్ట్ విక్ తో ప్రైవేట్ జెట్ లో ఇటలీకి ప్రయాణం అవుతూ ప్రియుడి ఒడిలో కూర్చొని లిప్ లాక్ పెడుతున్న ఫోటోని షేర్ చేసి దానికి కాప్షన్ గా లెట్స్ గెట్ మ్యారీడ్ బేబీ అంటూ ఒక క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ అమీ జాక్సన్ పెళ్లికి రెడీ అయింది అని కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ ప్రైవేట్ జెట్ లో కేవలం ఈ జంట మాత్రమే కాదు అమీ జాక్సన్ ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: