కాకినాడ నేపథ్యంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మట్కా’ సినిమాలో వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా  జరుగుతుండగా తాజాగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఇక ‘మట్కా’ సినిమాలోని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను కాకినాడలో షూట్ చేస్తున్నారు. ఈ కీలక షెడ్యూల్‌లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి తాజాగా మేకర్స్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో కాకినాడ పోర్టులోని ఓ క్రూజ్ షిప్ వద్ద వరుణ్ తేజ్ చేతిలో తుపాకి

 పట్టుకుని ఉన్నాడు. కాగా ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వరుణ్ తేజ్ తనదైన స్టైల్‌లో యాక్షన్ సీన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నాడు. అతని ఈ కొత్త అవతారం ప్రేక్షకులను ఆకట్టుకునే అంశంగా మారనుంది. ఇకపోతే  ‘మట్కా’ అనే పదం వింటేనే చాలామందికి మట్కా గేమ్ గుర్తుకు వస్తుంది. కానీ ఈ సినిమా మట్కా గేమ్‌కు సంబంధించిన కథ కాదని తెలుస్తోంది. ఈ సినిమాలో మట్కా అనే పదాన్ని టైటిల్‌గా ఎందుకు ఉపయోగించారనేది ఇంకా రహస్యంగానే ఉంది. ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త ఊపు తెస్తుందని

 భావిస్తున్నారు. వరుణ్ తేజ్ లాంటి యంగ్ హీరోలు కొత్త రకాల సినిమాలు చేయడం ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. సినిమాపై అభిమానులు భారీగా ఆసక్తి చూపుతున్నారు. ఇది ఇలా ఉంటే ‘మట్కా’ సినిమా విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ చిత్రాన్ని డా.విజేందర్ రెడ్డి తీగల, రజని తాళ్ళూరి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. జివి.ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నరు.  అయితే ఈ సినిమా 2024 చివరి నాటికి లేదా 2025 ప్రారంభంలో విడుదల కావచ్చని అంచనా.

మరింత సమాచారం తెలుసుకోండి: