మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ ఏడాది నితిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహారాజ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాతో విజయ్ సేతుపతికి మరింత మరి క్రేజ్ పెరిగిపోయింది. అయితే ఈ సినిమా థియేటర్లలోనే కాకుండా ఓటీడీ ఫ్లాట్ ఫామ్ లో కూడా భారీ విజయాన్ని అందుకుంటుంది. దర్శకుడు పేరుకెక్కించిన తీరుకి ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటించిన పాత్రకి అభిమానులు అంతా ప్రశాంతుల వర్షాన్ని కురిపిస్తున్నారు. 

ఇకపోతే విజయ్ సేతుపతి తన తదుపరి చిత్రాల గురించి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా పాండిరాజ్ దర్శకత్వంలో ఒక సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా సత్యజ్యోతి ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాకి  సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది ఏంటంటే ఈ చిత్రంలోకి నేషనల్ అవార్డు విన్నర్ నిత్యా మీనన్ అడుగు పెట్టినట్లు సమాచారం.  ఈ జంట కలిసి తెరపై కనిపించడం ఇదే మొదటిసారి కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ విషయం పై మరింత అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

విజయ్ సేతుపతి తన ప్రతి సినిమాలోనూ విభిన్న పాత్రలను పోషించడానికి ప్రసిద్ధి. ఈసారి కూడా ఆయన ఒక కొత్త పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం.తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా విజయ్ సేతుపతి సినిమాలు విడుదలవుతున్నాయి. ఆయన పాన్ ఇండియా స్టార్‌గా మారడానికి ప్రయత్నిస్తున్నారు. టాలీవుడ్  నాచురల్ స్టార్ నాని నటించిన అలా మొదలైంది అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు  పరిచయం అయ్యింది నిత్య. తెలుగు ఆడియన్స్ బొద్దుగా ఉన్న హీరోయిన్లను పెద్దగా ఆదరించరు. కాని నిత్య మీనన్ ను మాత్రం బాగా రిసీవ్ చేసుకున్నారు.  మంచి మంచి సినిమాలు చేసి.. తెలుగు లో మంచి పేరు తెచ్చుకుంది నిత్యా మీనన్.  కుర్రాళ్ళ మనసులను కొల్లగొట్టింది .

మరింత సమాచారం తెలుసుకోండి: