శాండిల్ వుడ్ లో యంగ్ హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ కస్తూరి రుక్మిణి వసంత్.. ఈమె 2019  బీర్బల్ అనే కన్నడ సినిమాతో పరిచయమయ్యింది. ఆ తర్వాత 2023లో సప్త సరాగాలు దాటి సినిమాతో అటు తెలుగు , కన్నడ ప్రేక్షకులకు మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమా రెండు భాగాలుగా తరాకెక్కించిన విజయాన్ని అందుకుంది ముఖ్యంగా ఉత్తమనటిగా ఫిలింఫేర్ క్రిటిక్ అవార్డు కూడా కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి అందుకున్నదట. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో రెండు మూడు చిత్రాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.



కస్తూరి రుక్మిణి వసంత్ వెంట తీవ్ర విషాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈమె అమ్మమ్మ అనారోగ్య సమస్యలతో మృతి చెందినట్లుగా తెలియజేస్తూ ఒక పోస్టుని షేర్ చేసింది. ఆగస్టు 23న తెల్లవారుజామున తాను నా అద్భుతమైన అమ్మమ్మని కోల్పోయానని నేను ఈమె గురించి ఎన్నో విషయాలు చెప్పగలను కానీ ఎంత ధైర్యవంతురాలు ఎన్ని తెలివితేటలు ఉన్నాయో తనకి మాత్రమే తెలుసు నేను ఆమె లాగా ఎదగాలని ఆశిస్తున్నాను అంటూ ఒక పోస్ట్ ని షేర్ చేసింది


అలాగే తన అమ్మమ్మకు సంబంధించి పాత ఫోటో లను సేకరించి స్క్రాప్ బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్నానని అలాగే ఆల్బమ్లపైన ఎక్కువ సమయాన్ని గడిపాను. అక్కడ తనకు ఇష్టమైన వారి జీవితాలను రికార్డు చేస్తూనే ఉంటాము నిన్ననే ఆల్బమ్ని కూర్చొని అందరం చూసాము కానీ ఆమె గురించి మా అభిప్రాయాలు పంచుకోవడంతో పాటుగా జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకున్నామని తెలియజేసింది. ఆ సందర్భంలో చాలాసార్లు ఏడ్చాను అని కూడా తెలియజేస్తోంది. తనని ఇంతవరకు తీసుకువచ్చిన తన అమ్మమ్మకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను అందుకు నేను కృతజ్ఞురాలిని అంటూ ఒక నోటుని సైతం రాసుకొచ్చింది. అయితే ఈ విషయం తెలిసిన అభిమానులు సైతం కస్తూరిరుక్మిణి వసంత్ కు ధైర్యం చెబుతూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: