టాలివుడ్ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ల నుంచి మెగా కుటుంబం, నందమూరి కుటుంబం మధ్య విభేదాలు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉంటాయి. కానీ బాలయ్య, చిరంజీవి మాత్రం మంచి స్నేహితులు అనే విషయాన్ని ఎన్నో సందర్భాలలో నిరూపించుకున్నారు. అయితే అభిమానులు మాత్రం ఎప్పటికప్పుడు మా హీరో అంటే మా హీరో అన్నట్టుగా పోట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇదంతా కేవలం సినిమాల వరకు మాత్రమే అయినా ఈమధ్య సోదర భావంతో మెలుగుతున్నారని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పుడు మరొకసారి ఇదే విషయాన్ని వారు నిరూపించబోతున్నట్లు తెలుస్తోంది.


ప్రముఖ పాటల రచయిత రామ జోగయ్య శాస్త్రి పెద్ద కుమారుడు వివాహ రిసెప్షన్ కి సైతం బాలయ్య చిరంజీవి హాజరైనట్లుగా తెలుస్తోంది. అక్కడ మాట్లాడుతున్నటువంటి వీరి మాటల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ముందుగా ఆ వధూవరులను ఆశీర్వదించిన తర్వాత చిరంజీవి తిరిగి వెళ్ళిపోతున్న క్రమంలో బాలయ్య సోదర అని ఆప్యాయంగా పిలిచి మాట్లాడారట. అయితే విరు మాట్లాడిన సంభాషణ అన్ స్టాపబుల్ షో గురించి మాట్లాడుకున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి.



ఈ విషయం పైన చిరంజీవి కూడా కచ్చితంగా వస్తానని బాలయ్యకు మాటిచ్చినట్లుగా తెలుస్తున్నది. అలాగే త్వరగా బోయ బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకకు సైతం హాజరు అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.మరి నిజానికి వీరిద్దరి మధ్య సంభాషణ జరిగినట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది. కానీ విరు ఏం మాట్లాడారనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.అయితే ఈ విషయం తెలిసిన అభిమానులైతే మాత్రం ఫుల్ ఖుషి గా ఫీల్ అవుతున్నారు. ఎన్నో దశాబ్ద కాలం నుంచి పోటీపడుతున్న ఈ హీరోలు ఇప్పుడు ఊహాగానాలకు చెక్ పెట్టారంటూ అభిమానులు తెలియజేస్తున్నారు. చిరంజీవి డైరెక్టర్ వశిష్టత విశ్వంభర చేయగా బాలయ్య డైరెక్టర్ బాబి దర్శకత్వంలో  NBK -109 చిత్రంలో నటిస్తున్నారు ఈ రెండు సినిమాలు షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: