సూపర్ స్టార్ రజినీ కాంత్ జైలర్ సినిమా హిట్ తో వరుస సినిమాలను సెట్స్ పైకి తీసుకువెళ్లాడు. జై భీమ్ వంటి సందేశాత్మక సినిమాను తెరకెక్కించిన దర్శకుడు టీ.జే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయాన్ లో నటిస్తుండగానే విక్రమ్ తో కమల్ హాసన్ కు అల్ టైమ్ హిట్టు అందించిన యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు తలైవా సూవర్ స్టార్ రజనీ కాంత్.ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతుంది. 40 రోజుల పాటు వైజాగ్ లో షూటింగ్ చేసేలా లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసింది యూనిట్. తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే న్యూస్ వినిపిస్తోంది.ఓవైపు వేట్టైయాన్ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. మరోవైపు కూలీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాలపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న వేట్టైయాన్ సినిమాలో రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమానే కాకుండా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న కూలీ చిత్రం కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుంది.
 తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కీలకపాత్రలో నటిస్తున్నాడని టాక్. దీంతో వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా ఎలా ఉంటుందో అని మరింత క్యూరియాసిటీ నెలకొంది.


ఇప్పటి వరకు కూలీ సినిమాలో ఉప్పి అనే వార్త సోషల్ మీడియాలో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఉప్పి ఆన్ బోర్డ్ ఫర్ కూలీ అంటూ అసలు విషయం చెప్పేస్తూ ఉపేంద్ర పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో ఉపేంద్ర రగ్గడ్ లుక్ లో కనిపిస్తూ సినిమాపై మరింత హైప్ పెంచారు. ఉపేంద్ర తన సినీ కెరీర్‌లో తొలిసారి సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి పనిచేస్తున్నారు. ఉప్పి ఈ లుక్ చూస్తే కూలీలో ఉప్పి అదరగొట్టడం గ్యారెంటీ అని తెలుస్తుంది.త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ లో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిచనుండగా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల విడుదలైన కూలీ టైటిల్ గ్లిమ్స్ కు విపరీతమైన స్పందన లభించింది. ప్రస్తుతం ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో UI అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఈ చిత్రంలో శృతి హాసన్, మహేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ముందుగా తలైవా 171 అన్నో టైటిల్ పెట్టారు. కానీ తర్వాత కూలీగా మార్చారు. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా వస్తున్న ఈ చిత్రానికి తమిళంతోపాటు తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: