పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్గా ఓ ప్రెస్ మీట్ లో ఇప్పటి హీరోలందరూ చెట్లను నరికి వేస్తూ స్మగ్లింగ్ చేస్తున్నారు అంటూ పరోక్షంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాను ఉద్దేశించి మాట్లాడారు. అయితే ఈయన  ఆ మూవీ ని ఉద్దేశించి మాట్లాడారో లేదో ఆయనకే తెలుసు. కానీ ఈయన మాటలు విన్న చాలా మంది అల్లు ఫాన్స్ మాత్రం పుష్ప సినిమాను ఉద్దేశించే మాట్లాడారని భావించారు. ఎందుకంటే అప్పటికే అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న నేపథ్యంలో పవన్ ఈ మాటలు మాట్లాడడంతో అంతా అల్లు అర్జున్ ని ఉద్దేశించే మాట్లాడారని అనుకున్నారు. అలాగే అల్లు అర్జున్ రీసెంట్ గా మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ఈవెంట్ లో కూడా నా ఫ్రెండ్స్ కోసం ఎక్కడికైనా వస్తాను ఏదైనా చేస్తాను అని పరోక్షంగా మెగా ఫ్యామిలీకి కౌంటర్ ఇచ్చారు. దీంతో వీరిరువురు మాట్లాడిన మాటలు నెట్టింట్లో వివాదానికి దారి తీస్తున్నాయి.

అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని, ఈ మాటలు ఎందుకు మాట్లాడారో ఆయన వెర్షన్ చెప్పాలి అంటూ పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ కామెంట్లు చేశారు అల్లు అర్జున్ మామ స్నేహ రెడ్డి తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి.. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్మగ్లింగ్ చేయడం,చెట్లను నరికి వేయడం అని ఎందుకు మాట్లాడారో ఆయన మాటలు వెనుకున్న అర్ధాన్ని పెద్ద మనసుతో బయట పెట్టాలి. అల్లు అర్జున్ కేవలం స్మగ్లింగ్ చేసే పాత్రలో నటించారు. కానీ ఆయన వ్యాపారం చేయడం లేదు కదా. ఒకవేళ స్మగ్లింగ్ చేస్తే ఆయనను తప్పుబట్టాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ని ఉద్దేశించి ఇలాంటి మాటలు మాట్లాడారంటే వాటిని వెనక్కి తీసుకోవాల్సిందే..ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు.

అలాగే అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని ఆ స్మగ్లింగ్ పాత్రకే భారత ప్రభుత్వం బన్నీకి అవార్డ్ ఇచ్చింది.ఒకవేళ పవన్ బన్నీపై కామెంట్స్ చేసినట్లయితే బన్నీకి అవార్డు ఇచ్చినా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పవన్ కళ్యాణ్ తప్పు పట్టినట్లే.పవన్ కళ్యాణ్ ఆ మాటలు మాట్లాడాక చాలామంది నాకు ఫోన్ చేసి ఇదేంటి ఆయన ఇలా మాట్లాడారు అని అసహనం వ్యక్తం చేశారు.కానీ పవన్ కళ్యాణ్ ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు మాట్లాడారో చెబితే ఈ వివాదానికి తెరపడుతుంది.అలాగే నాగబాబు కూడా తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్టు ఫ్రస్ట్రెషన్ లో పెట్టారని నేను భావిస్తున్నాను అంటూ అల్లు అర్జున్ తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈయన మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి

మరింత సమాచారం తెలుసుకోండి: