గత 24 గంటల నుండి నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయడంపై ఎన్ని వార్తలు మీడియాలో వినిపించాయో చెప్పనక్కర్లేదు. అయితే నాగార్జున తుమ్మిడి కుంట చెరువులోని దాదాపు మూడున్నర ఎకరాల వరకు భూమి కబ్జా చేసి ఫంక్షన్ హాల్ కట్టుకున్నారని ఈయనపై ఆరోపణలు రావడంతో తెలంగాణ ప్రభుత్వం హైడ్రా పేరుతో ఆ అక్రమ కట్టడాన్ని కూల్చివేసింది. అయితే నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ దాదాపు పది ఎకరాలు ఉంది.అందులో ఉన్న మూడున్నర ఎకరాలు తుమ్మిడికుంట చెరువులోని భాగం అని తెలియడంతో అది కూల్చేసారు.కానీ ఆ తర్వాత నాగార్జున ఈ విషయంపై స్పందించి నేను కోర్టుకు వెళ్తానని చెప్పారు.ఇక కోర్టులో నాగార్జునకు కాస్త రిలీఫ్ వచ్చింది. కూల్చివేతని ఆపాలని కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. కానీ అప్పటికే నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేశారు.

 అయితే తాజాగా నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై బాలకృష్ణ మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ గా మారాయి. అయితే బాలకృష్ణకు నాగార్జునకి మధ్య మాటలు లేవని, వీరిద్దరి మధ్య సఖ్యత లేదు అని ఎప్పటినుండో ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట.ఇక ఇలాంటి నేపథ్యంలో బాలకృష్ణ మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే బాలకృష్ణ ఓ హాస్పిటల్ నుండి వస్తూ  చాలా కోపంగా కొన్ని మాటలు మాట్లాడారు. ఇక ఆ మాటలు ఏంటంటే.. సినీ సమస్యల మీద ఎన్నోసార్లు మీటింగ్లు పెట్టుకున్నారు. కానీ నన్ను వాళ్ళు ఎవరూ కూడా ఒక్కసారి కూడా పిలవలేదు.వాళ్ళందరూ భూములు పంచుకుంటారా..

 నన్ను ఒక్కసారి కూడా మీటింగ్స్ పిలవకుండా వాళ్ళందరూ హైదరాబాదులోని భూములు పంచుకుంటారు అంటూ బాలకృష్ణ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే బాలకృష్ణ మాట్లాడిన ఈ వీడియోలోని మాటలు ఇప్పటివైతే కావు. గతంలో మాట్లాడిన మాటలు. కానీ మళ్ళీ ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది. దానికి కారణం నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయడమే. అయితే ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చి వేయడంతో బాలకృష్ణ మాట్లాడిన వీడియోను ట్యాగ్ చేస్తూ బాలకృష్ణ పరోక్షంగా నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను ఉద్దేశించే మాట్లాడారు కావచ్చు అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: