ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్లలో మనిషా కొయిరాలా ఒకరు. ఈమె అనేక తమిళ , హిందీ సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని దేశ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈమె సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన హిరామండి అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ లో మనిషా కొయిరాలా వేశ్య పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను , విమర్శలను అద్భుతమైన స్థాయిలో మెప్పించింది.

ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం ఈ ముద్దు గుమ్మ అరవింద స్వామి హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన బొంబాయి అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయం అందుకుంది. తాజాగా మనిషా కొయిరాలా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. మనిషా కొయిరాలా తాజా ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ ... ఈ సినిమాలోని ఊరికే పలుక సాంగ్ చాలా మంది కి ఫేవరెట్.

అది ఎంతో అద్భుతమైన సాంగ్. కానీ దానిని చిత్రీకరించేటప్పుడు నేను ఎంతో భయపడ్డాను. ఆ సాంగ్ చిత్రీకరణ సముద్రం ఒడ్డున ఉన్న ఒక పురాతన కట్టడం వద్ద జరిగింది. అక్కడ పెద్ద పెద్ద రాళ్లు , చుట్టూ ముళ్ళ పొదలు ఉన్నాయి. ముఖ్యంగా ఆ ప్రదేశం లో జలగలు భారీగా ఉన్నాయి. ఆ పాటలో తాను పొడవాటి నీలి రంగు దుస్తులను వేసుకొని పరిగెత్తాలి. కానీ కింద పడితే ఎక్కడ జలగలు తనను పట్టిస్తాయో అని భయపడినట్లు మనీషా కొయిరాలా తాజా ఇంటర్వ్యూ లో బాగంగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mk