టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన స్థాయి కలిగిన దర్శకులలో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన వారిలో పూరి జగన్నాథ్ ఒకరు. ఈ దర్శకుడు తన కెరీయర్ ను ప్రారంభించిన కొత్తలో వరుసగా బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంటూ వెళ్ళాడు. దానితో ఈయన తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ దర్శకుడి స్థాయికి చాలా తక్కువ కాలంలో చేరుకున్నాడు. ఇలా ఈయన దర్శకత్వం వహించిన సినిమాలలో చాలా సినిమాలు అద్భుతమైన విజయాలను సాధిస్తూ రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోలు ఈయనతో సినిమా చేయడానికి పోటీ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.

కానీ ఈ మధ్య కాలంలో మాత్రం పూరి జగన్నాథ్ ఆ స్థాయి విజయాలను అందుకోవడం లేదు. ఎన్నో సినిమాలు చేస్తే అందులో ఒకటి , రెండు విజయాలను అందుకుంటున్నాయి. అవి కూడా మరి బ్లాక్ బాస్టర్ విజయాలు కావడం లేదు. దానితో ఆయన కెరియర్ గ్రాఫ్ భారీగా పడిపోయింది. ఇకపోతే ఆఖరుగా ఈ దర్శకుడు ఈస్మార్ట్ శంకర్ మూవీ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత లైగర్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ సినిమా తర్వాత కాస్త ఎక్కువ టైమ్ తీసుకున్న పూరి జగన్నాథ్ , రామ్ పోతినేని హీరోగా డబల్ ఇస్మార్ట్ అనే మూవీ ని రూపొందించాడు.

ఆగస్టు 15 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా కూడా ఫ్లాప్ టాప్ ను తెచ్చుకుంది. ఇక పూరి జగన్నాథ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభావం చూపకపోవడానికి ప్రధాన కారణం ఆయన కెరియర్ ప్రారంభంలో ఎలాంటి కంటెంట్ తో సినిమాలు చేశాడో ఇప్పటికీ అలాంటి కంటెంట్ తోటే మూవీ లు చేస్తున్నాడు. ఆయన కొత్త రకం సినిమాలు చేసినట్లు అయితే మళ్లీ హిట్ లను అందుకునే అవకాశం ఉంది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరి పూరి జగన్నాథ్ తన రూటు మార్చి కొత్త రకమైన సినిమాలను తెరకెక్కిస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: