తమిళ నాడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలన చోటు చేసుకుంది. తమిళ నాడు రాష్ట్ర రాజకీయాలపై సూపర్‌ స్టార్‌ రజినీ కాంత్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా హీరో విజయ్‌ పెట్టిన పార్టీపై పరోక్షంగా కామెంట్స్‌ చేశారు సూపర్‌ స్టార్‌ రజినీ కాంత్. డీఎంకే పార్టీ మర్రి చెట్టు లాంటిదంటూ కితాబ్‌ ఇచ్చారు సూపర్‌ స్టార్‌ రజినీ కాంత్. ఎలాంటి తుఫానునైనా ఎదుర్కొంటుందని వెల్లడించడం జరిగింది. డీఎంకే మర్రి చెట్టును ఎవరూ కదిలించలేరని కొత్తగా వచ్చిన పార్టీలకు కౌంటర్‌ ఇచ్చారు సూపర్‌ స్టార్‌ రజినీ కాంత్.


తాజాగా తమిళనాడు రాష్ట్ర మంత్రి ఎ.వి.వేలు రచించిన 'కళైంజ్ఞర్‌ ఎనుమ్‌ థాయ్‌' పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. అయితే.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూపర్‌ స్టార్‌ రజినీ కాంత్ వచ్చారు. ఈ సందర్భంగా సూపర్‌ స్టార్‌ రజినీ కాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  రాజకీయాల గురించి మాట్లాడితే జాగ్రత్తగా ఉండాలని కోరారు సూపర్‌ స్టార్‌ రజినీ కాంత్. విమర్శలు ఇతరులను బాధించకూడదని చెప్పుకొచ్చారు.  


కళాకారుడు కరుణానిధి ఎదుర్కొన్న సమస్యలు మరెవరికైనా జరిగి ఉంటే కనుమరుగయ్యే వారంటూ గుర్తు చేశారు.. కరుణానిధి సమాజం, ప్రజల సంక్షేమం కోసం కృషి చేశారని చెప్పడం జరిగింది.  రాజనాథ్ సింగ్ కరుణానిధి గురించి అరగంట ఆయన ఒక్కడే మాట్లాడినట్టు కాదు పై నుంచి ఆర్డర్ వస్తేనే ఆయన అంతలా మాట్లాడి ఉంటారని పేర్కొన్నారు సూపర్‌ స్టార్‌ రజినీ కాంత్.


సీనియర్లను హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు కానీ స్టాలిన్ సమర్థవంతంగా ఆ ప ని చేస్తూ ఉన్నారన్నారు సూపర్‌ స్టార్‌ రజినీ కాంత్. వరుసగా పార్టీకి విజయాలను తీసుకుని వస్తున్నారు ఆయనకు నా అభినందనలు అంటూ పేర్కొన్నారు. అయితే.. సూపర్‌ స్టార్‌ రజినీ కాంత్  చేసిన వ్యాఖ్యలు.. విజయ్‌ కి కౌంటర్‌ ఇచ్చేలా ఉన్నాయని కొందరు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: