ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ ‘సినిమా సూపర్ హిట్ అయింది. థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో రికార్డులు సృష్టిస్తోంది. కల్కి సినిమా తో ప్రభాస్ రేంజ్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ ‘ది రాజాసాబ్’ సినిమా పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీంతో పాటు త్వరలోనే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ మూవీని కూడా పట్టాలెక్కించనున్నాడని సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఇందులో సౌతిండియన్ బ్యూటీ క్వీన్ త్రిష విలన్ గా నటిస్తుందని సమాచారం. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన సినిమాల్లో హీరో ఎలివేషన్స్ ఎలా ఉంటాయో అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల్లో చూశాం. ఇప్పుడు స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ఎలాంటి క్యారెక్టర్‌లో కనిపిస్తాడనో ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.మరోవైపు ఈ సినిమా కోసం త్రిషను ఎంపిక చేసేందుకు సందీప్ రెడ్డి వంగ సిద్ధమైనట్లు అందరికి తెలిసిందే. కాగా ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడని టాక్. త్రిష కథానాయికగా కనిపించనుందట. అయితే ఆమె పాత్రకు నెగెటివ్ షేడ్స్ ఉంటాయట. మరోవైపు ఇందులో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. హీరోతో పాటు విలన్ పాత్రలోనూ డార్లింగే కనిపించనున్నారని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.ఈ నేపథ్యంలోనే విలన్ పాత్రలో నటించే ప్రభాస్ కు జోడీగా త్రిష కనిపించనుందట.ఇదిలావుండగా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మామూలుగానే ప్రభాస్‌ను తట్టుకోలేరు. అలాంటిది డ్యూయెల్ రోల్, అందులోను నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో విలన్‌గా నటిస్తే.. థియేటర్లు తగలబడిపోతాయ్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఇప్పుడు సందీప్ రెడ్డి.. ప్రభాస్‌ను స్పిరిట్‌లో హీరోగా, విలన్‌గా చూపించబోతున్నాడట. ఒకవేళ ఇదే నిజమైతే.. స్పిరిట్‌ ఊహకందని విధంగా ఉంటుందనే చెప్పాలి. అనిమల్ సీక్వెల్‌ను రణ్‌బీర్ వర్సెస్ రణ్‌బీర్‌గా ప్లాన్ చేస్తున్న సందీప్.. దానికంటే ముందే ప్రభాస్ వర్సెస్ ప్రభాస్‌గా ప్లాన్ చేస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: