యానిమల్ బ్యూటీ అనగానే అందరికీ రష్మిక మందన్నా కాదు రష్మిక మందన్నా ని పక్కకు నెట్టి రెండే రెండు నిముషాల బోల్డ్ సీన్స్ తో ఒక్కసారిగా నేషనల్ క్రష్ ట్యాగ్ సంపాదించిన త్రిప్తి డిమ్రీ నే గుర్తుకు వస్తుంది. రణ్ బీర్ కపూర్ తో రొమాంటిక్ సన్నివేశాల్లో న్యూడ్ గా నటించి కుర్రాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్న త్రిప్తి డిమ్రీ కి సంబంధించి ఏ చిన్న వార్త నెట్టింట్లో చక్కర్లు కొట్టినా తెగ వైరల్ అవుతుంది. దానికి కారణం యానిమల్ మూవీ క్రేజ్ అని చెప్పుకోవచ్చు.ఇక ఈ సినిమా తర్వాత త్రిప్తి డిమ్రీ కి వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి.అలా ఈమె రీసెంట్ గా నటించిన బ్యాడ్ న్యూజ్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అలాగే సౌత్ లో కూడా త్రిప్తి డిమ్రీ కి రెండు మూడు ఆఫర్స్ వచ్చినట్టు తెలుస్తోంది. 

అయితే అలాంటి  త్రిప్తి డిబమ్రీ గత కొద్ది రోజులుగా మోడల్ కం బిజినెస్ మాన్ అయినటువంటి సామ్ మర్చంట్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుందని బీటౌన్ లో ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక యానిమల్ మూవీ తర్వాత ఈ హీరోయిన్ మరింత క్రేజ్ సంపాదించింది కాబట్టి ఈ హీరోయిన్ ఎక్కడికి వెళ్లినా కూడా ఆమెకు సంబంధించిన న్యూస్ చాలా వైరల్ అవుతుంది. ఇక త్రిప్తి డిమ్రీ బయట కనిపించింది అంటే చాలు మీడియా వాళ్ళు గుమిగూడి ఫోటోలు తీస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ప్రియుడితో కలిసి అంటే సామ్ మర్చంట్ తో త్రిప్తి డిమ్రీ ముంబైలోని ఓ రెస్టారెంట్ కి రొమాంటిక్ డిన్నర్ కి వెళ్ళిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

అయితే చాలా రోజుల నుండి త్రిప్తి డిమ్రీ ప్రేమలో ఉంది అంటూ వస్తున్న వార్తలకి ఎలాంటి క్లారిటీ లేదు.కానీ ఈ వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా ప్రియుడుతో పబ్లిక్ గానే రెస్టారెంట్లు, హోటోల్స్ అంటూ తిరగడంతో ఈ హీరోయిన్ వ్యవహారం పీక్స్ కి వెళ్ళిపోయిందని, త్వరలోనే ఈ జంట పెళ్లి  పీటలెక్కబోతున్నారని కొంతమంది బీటౌన్ జనాలు మాట్లాడుకుంటున్నారు.. ఇక సామ్ మర్చంట్,త్రిప్తి డిమ్రీలు 2017 నుండి లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: