సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ ని మూడో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మొదట నటుడు ప్రతాప్ పోతేన్ తో సహజీవనం చేసిన ఈ ముద్దుగుమ్మ పెళ్లి వరకు వెళ్ళింది.కానీ అతన్ని పెళ్లి చేసుకోలేదు. ఆ తర్వాత రీఛార్డ్ హార్డి ని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చింది. కానీ ఈయనతో కూడా బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. ఆ తర్వాత చివరికి నటుడు శరత్ కుమార్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే రాధిక శరత్ కుమార్ ని పెళ్లి చేసుకోవడం కారణంగా ఆయన ప్రేమించిన హీరోయిన్ కి దూరం అయ్యారని అప్పట్లో కోలీవుడ్ మీడియా మొత్తం కోడై కూసింది.మరి ఇంతకీ రాధిక వల్ల నిజంగానే శరత్ కుమార్ తాను ప్రేమించిన అమ్మాయికి దూరం అయ్యారా.. ఇంతకీ శరత్ కుమార్ ప్రేమించిన ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. 

శరత్ కుమార్ మొదట వరలక్ష్మి తల్లి చాయ ని పెళ్లి చేసుకున్నారు.వీరి బంధం దాదాపు 16 ఏళ్లు కొనసాగింది.ఆ తర్వాత ఛాయా కి విడాకులు ఇచ్చేశారు. ఇక మొదటి భార్యతో విడాకుల తర్వాత శరత్ కుమార్ పేరు ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరోయిన్లతో వినిపించింది.అందులో మొదటగా నగ్మా, దేవయాని ల పేర్లు గట్టిగా వినిపించాయి. నగ్మా ప్రేమలో పడి శరత్ కుమార్ తనని పట్టించుకోవడం లేదని ఓసారి రాధిక నగ్మాకి వార్నింగ్ ఇచ్చింది అనే టాక్ కూడా కోలీవుడ్ లో వినిపించింది.అలాగే శరత్ కుమార్ రాధిక కంటే ముందు హీరోయిన్ దేవదానిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నారట.

కానీ అదే సమయంలో శరత్ కుమార్ కి రాధిక పరిచయం అవ్వడం, వీరిద్దరికీ మధ్య ఎమోషనల్ బాండింగ్ ఏర్పడడంతో శరత్ కుమార్ మొదట ప్రేమించిన దేవయానిని వదులుకోవాల్సి వచ్చిందట.అంతేకాదు అప్పట్లో రాధిక శరత్ కుమార్ అప్పులన్నీ కట్టిందనే టాక్ కూడా వినిపించింది. అలా ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ ఇచ్చేసరికి దేవయాని కాదని రాధికను శరత్ కుమార్ రెండో పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వినిపించాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: