పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా ది రాజా సాబ్ అనే సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసింద. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాళవిక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. మాళవిక మోహన్  తన సహనటుడు ప్రభాస్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ఏమాత్రం మారలేదని ఆమె పేర్కొన్న వ్యాఖ్యలు వారిద్దరి మధ్య స్నేహబంధం ఎంతటిదో తెలియజేస్తున్నాయి. అయితే తాజాగా మాళవిక మోహన్ తన ఇటీవల ఇంటర్వ్యూలో ప్రభాస్ తనతో ఎప్పుడూ చాలా సరదాగా ఉంటారని, సెట్స్‌లో అందరితో కలిసి మెలగడానికి ఇష్టపడతారని

 తెలిపారు. ప్రభాస్‌తో పనిచేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, ఆయన వ్యక్తిత్వం ఎంతటిదో ఈ సినిమా ద్వారా తెలుసుకున్నట్లు చెప్పారు. ప్రభాస్‌లాంటి స్టార్ హీరోలు మారడం సహజమే అని అంతా అనుకుంటారు కానీ ప్రభాస్ మాత్రం తన మొదటి రోజుల్లో ఎలా ఉంటే ఇప్పటికీ అలాగే ఉన్నారని మాళవిక పేర్కొన్నారు. ఆయన స్టార్‌డం‌కు అతీతంగా చాలా సరళంగా ఉంటారని, అందరితో సమానంగా మెలగడానికి ఇష్టపడతారని తెలిపారు. మాళవిక మోహన్ , ప్రభాస్ ఇద్దరూ కలిసి నటించిన సినిమా విడుదలకు ముందే ఈ వ్యాఖ్యలు చాలా హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వార్తను ఆనందంతో

 స్వీకరిస్తున్నారు. మాళవిక మోహన్ కూడా ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటంతో ప్రభాస్, మాళవిక మోహన్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరుగుతోంది. ప్రభాస్ తన కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన సినిమాలను చేసినప్పటికీ, ఆయన ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటున్నారు. మాళవిక మోహన్ కూడా తన అందం, నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇది ఇలా ఉంటే  ఈ సినిమాలో మరో బ్యూటీ నిధి అగర్వాల్ కూడా నటిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టిజి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సమ్మర్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: