టాలీవుడ్ లో నాచురల్ హీరోయిన్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చే హీరోయిన్ సాయి పల్లవి.. తను న్యాచురల్ లుక్ తోనే ఈ ముద్దుగుమ్మ అందర్నీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా డాన్స్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. సౌత్ ఇండియాలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. మొదట మలయాళం చిత్రం ప్రేమమ్ సినిమా ద్వారా సాయి పల్లవి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి అంతకంటే ముందు సాయి పల్లవి ఒక సినిమాలు యాక్ట్ చేసిందని విషయం చాలామందికి తెలియకపోవచ్చు.



ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి ఈ విషయాన్ని రివిల్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చాలామంది తను ప్రేమమ్ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు అనుకుంటున్నారు.. కానీ అంతకుముందు తాను రెండు చిత్రాలలో నటించాలని కూడా తెలియజేసింది.. ఒకటి కస్తూరి మాన్ ధామ్ ధూమ్ మరొకటి తమిళ సినిమాలో చిన్న పాత్రలో నటించిన తెలిపింది. విషయాన్ని అభిమానులు తెలిసిన వెంటనే ఆ చిత్రాలకు సంబంధించి కొన్ని క్లిప్పింగ్ వీడియోలను కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా చేస్తున్నారు.


ఆ వీడియోలను అప్పటికి ఇప్పటికీ కంపేర్ చేస్తూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే తను నటించిన టాలీవుడ్ ఫస్ట్ మూవీ ఫిదా సినిమా తనకి గుర్తుండిపోయే సినిమా అని ఫిదా సినిమా పోస్టర్ మొదటిసారి చూసినప్పుడు  తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయని  తెలియజేసింది. ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ని కూడా తెలుగులోనే మాట్లాడాలనుకున్నాను అందుకే తాను చాలా కష్టపడి తెలుగు నేర్చుకొని మరీ మాట్లాడాను అని తెలిపింది. ఈ చిత్రానికి తనకు ఫిలింఫేర్ అవార్డు కూడా రావడం జరిగిందని తెలిపింది. ఫిదా సినిమాతో తన కెరియర్ మలుపు తిరిగిందని ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది సాయి పల్లవి. ప్రస్తుతం నాగచైతన్యతో తండేల్ సినిమాలో నటిస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: