కన్నడ సినీ హీరో దర్శన్ రేణుక స్వామి అనే అభిమాని హత్య కేసులో దాదాపుగా రెండు నెలలపాటు జైల్లోనే జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ప్రస్తుతం దర్శన్ పవిత్ర గౌడ్ ఈ కేసులో రిమాండ్ ఖైదిగా ఉన్నారు. ప్రస్తుతం ఈ కేస్ అయితే విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. సినిమాలలో నటిస్తున్నప్పుడు హీరో దర్శన్ తన జీవితాన్ని లగ్జరీ లైఫ్ గా గడిపేవారు. తనకు ఇష్టమైన వాటినన్నిటిని కూడా తింటూ ఉండేవారు దర్శన్. కానీ జైలుకు వెళ్లిన తర్వాత కృంగిపోయారని అనారోగ్యానికి గురయ్యారని వార్తలు ఎక్కువగా వినిపించాయి.


కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే అవన్నీ కూడా అవాస్తవాలే అన్నట్లుగా కనిపిస్తోంది.హీరో దర్శన్ కు జైల్లో కూడా అన్ని సౌకర్యాలు అందుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలలో ప్రకారం దర్శన్ కాఫీని తాగుతూ సిగరెట్ ను  కాల్చుతూ కనిపిస్తున్నట్లుగా ఉన్నది. హీరో దర్శన్ ప్రత్యేకమైన బ్యారక్ నుంచి బయటికి వచ్చి మరి కొంతమందితో కూర్చొని కబుర్లు చెబుతూ కనిపిస్తున్నట్లు ఒక ఫోటో వైరల్ గా మారుతున్నది.


ఈ ఫోటో చూసిన పలువురు నెటిజన్స్ హీరో దర్శన్ కు జైలులో కూడా ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారా అంటూ పలువురు నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం పైన జైలు అధికారుల తీరు పైన కూడా పలు రకాల అనుమానాలు ఉన్నాయంటూ తెలియజేస్తున్నారు. హీరో దర్శన్ కేసు పైన కూడా ఎన్నో సంచలన ఆరోపణలు వినిపించాయి. ముఖ్యంగా దర్శన్ గ్యాంగ్ కూడా వ్యతిరేకంగా చాలానే సాక్ష్యాలు ఉన్నట్లు సమాచారం. మరి కొద్ది రోజులలో పోలీసులు ఛార్జ్ సీట్లను సైతం సమర్పించడానికి సిద్ధంగా ఉంటున్న సమయంలో ఇలా దర్శనం ఫోటోలు వైరల్ గా కావడంతో చాలామంది మాట్లాడుకుంటున్నారు. దర్శన్ జైల్లో ఉన్నప్పుడు గుండు కొట్టించుకున్నట్లుగా సమాచారం. అభిమానులైతే ఇదంతా ఫేక్ న్యూస్ అంటూ కొట్టి పారేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: