టాలీవుడ్, బాలీవుడ్ లో హీరోయిన్ అమీ జాక్సన్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఈ ముద్దుగుమ్మ సినిమాలలో కంటే నిరంతరం ఎఫైర్లు పెళ్లి విషయాలతోనే వైరల్ గా మారుతూ ఉంటుంది. రామ్ చరణ్ తో ఎవడు సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించి మంచి క్రేజీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ విక్రమ్ ఐ సినిమాలో కూడా నటించి బాగానే క్రేజీ సంపాదించుకుంది. ధనుష్ నటించిన ఒక చిత్రంలో కూడా అమీ జాక్సన్ నటించింది. అమీ జాక్సన్ బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఏమి బాలీవుడ్ లో క్రాక్ అనే సినిమాలో నటిస్తున్నది.


ఈమె పర్సనల్ జీవిత విషయానికి వస్తే గత కొన్ని నెలలుగా ఇంగ్లీష్ యాక్టర్ మ్యూజియం ఎడ్వర్డ్ వేస్ట్ వీక్  తో ప్రేమలో ఉన్నట్లుగా తెలియజేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కూడా తెలియజేసింది ఇక అప్పటినుంచి తన ప్రియుడుతో సైతం వెకేషన్కు  వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అమీ జాక్సన్. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది.ఇదంతా ఇలా ఉండగా తాజాగా అమీ జాక్సన్ తన ప్రియుడిని వివాహం చేసుకున్నట్లు తన ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేసింది.


అయితే అమీ జాక్సన్ కు ఇది రెండవ వివాహం మొదట వివాహం 2015లో ప్రముఖ వ్యాపారవేత్త ఆండ్రియాస్ తో జరిగింది .వీరిద్దరికీ ఒక బాబు కూడా జన్మించారు. ఆ తర్వాత కొన్ని కారణాల చేత వీరిద్దరు విడిపోవడం కూడా జరిగింది. అప్పటినుంచి తన బాబు బాధ్యత అమీ జాక్సన్ తీసుకుంది. ఏది ఏమైనా రెండవ వివాహం చేసుకొని తన కొత్త జర్నీని మొదలు పెట్టబోతున్నాననే విధంగా క్యాప్షన్ ని జత చేసింది అమీ జాక్సన్. ఒకవైపు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నప్పటికీ మరో కొంతమంది అమీ జాక్సన్ ఈ వివాహ బంధాన్ని అయినా ఎక్కువ రోజులు నిలబెట్టుకుంటుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: