మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి హీరోగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. అలాంటి వాటిలో అందరివాడు సినిమా ఒకటి. శ్రేణి వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. 2005లో విడుదలైన ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించారు. టబూ, రీమిసేన్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాలో చిరంజీవి తన అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను మెప్పించారు.


టీవీ ఛానల్ లో రిపోర్టర్ గా, మేస్త్రి గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈ సినిమాలో నటించిన సెకండ్ హీరోయిన్ ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో చిరంజీవి రీమిసేన్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక అందరివాడు సినిమా తర్వాత ఈ భామ ఎక్కువగా సినిమాల్లో కనిపించలేదు. ఇప్పుడు రిమీ సెన్ ఎక్కడ ఉంది... ఎలా ఉంది అని అనేక రకాలుగా చర్చలు మొదలయ్యాయి.

రీమిసేన్ బెంగాలీ, హిందీ సినిమాల్లో ఎక్కువగా నటించేది. అసలు పేరు శుభమిత్ర సేన్. చిన్ననాటి నుంచి నటి కావాలన్నా తన కలను నిజం చేసుకుంది. చదువు పూర్తయ్యాక కోల్కతా నుండి ముంబైకి వచ్చింది. అమీర్ ఖాన్ తో కోకా కోలా యాడ్ లలోను నటించింది. తెలుగులో ఇదే నా మొదటి ప్రేమలేఖ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. హిందీలో ధూమ్, క్యోన్ కి, గరం మసాలా, గోల్మాల్ వంటి భారీ బడ్జెట్ సినిమాల్లో నటించింది.


2017లో బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొంది. తెలుగులో ఇదేనా మొదటి ప్రేమలేఖ, నీ తోడు కావాలి, అందరివాడు వంటి తెలుగు చిత్రాలలో కూడా నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ అమ్మడు ఇప్పుడు అంతకు మించిన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రీమిసేన్ గ్లామరస్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: