సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్టులఫై ఎప్పుడూ భారీ రేంజ్ లోనే అంచనాలు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలా క్రేజీ ప్రాజెక్టులకు సంబంధించి ఏదైనా ప్రకటన విడుదలైంది అంటే చాలు.. ఆ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సినిమాలు మాత్రం దురదృష్టవశాత్తు ఇలా ప్రకటనలు విడుదలైనప్పటికీ ఆ తర్వాత వివిధ కారణాలతో ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇలాంటి ఘటనలు అటు అభిమానులందరినీ కూడా తీవ్ర నిరాశకు కృషి చేస్తూ ఉంటాయి.


 అయితే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమా విషయంలో కూడా గతంలో అభిమానులకు ఇలాంటి నిరాశ ఎదురయింది అని చెప్పాలి. కోలీవుడ్లో స్టార్ హీరో అయినప్పటికీ అటు హీరో సూర్య టాలీవుడ్ లోనూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఏకంగా తన సినిమాలను తెలుగులోను డబ్ చేస్తూ ఇక్కడ బ్లాక్ బస్టర్లు సొంతం చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకే సూర్యకి తెలుగులో కూడా ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే గతంలో సూర్య ఒక క్రేజీ డైరెక్టర్ తో ఒక మూవీ ని అనౌన్స్ చేశాడు. కానీ ఈ మూవీ ఏం అసలు మొదలుకాకముందే ఆగిపోయింది. అభిమానులు కూడా ఈ సినిమా గురించి మర్చిపోయారు. కానీ ఇప్పుడు ఈ సినిమా మళ్లీ మొదలు కాబోతుందట.


 ఈ క్రేజీ న్యూస్ ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారిపోయింది. పా రంజిత్ - సూర్య కాంబినేషన్లో జర్మన్ అనే మూవీని కొన్నేళ్ల క్రిందట ప్లాన్ చేశారు. కానీ ఈ మూవీ కార్యరూపం దాల్చలేదు. అయితే తాజాగా ఈ మూవీ పట్టాలెక్కపోతున్నట్లు సమాచారం. ఓ భారీ బడ్జెట్ ప్రాజెక్టు కోసం డైరెక్టర్ పా రంజిత్ తో నిర్మాణ సంస్థ గ్రీన్ స్టూడియోస్ ఒప్పందం చేసుకున్నట్లు ఒక టాక్ ప్రస్తుతం కోలీవుడ్లో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ మూవీ సూర్యతో ఇద్దరికీ ఎక్కించబోయే మూవీనే అంటూ అందరూ చర్చించుకుంటున్నారు. కాగా మొన్నటికి మొన్న విక్రమ్ తో తంగలాన్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ని తీసి హిట్టు కొట్టిన పా రంజిత్ ఇప్పుడు సూర్యతో ఎలాంటి మూవీ తీయబోతున్నాడు అనే విషయంపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: