చాలా మంది హీరోయిన్స్‌కు సరైన బ్రేక్స్ లేక కనుమరుగవుతున్నారు. సౌత్‌లో అలాంటి పరిస్థితి చాలా మందికి ఎదురైంది. అందుకే ప్రతి హీరోయిన్ తన సినిమా హిట్ అవ్వాలని ఎంతో తహతహలాడుతుంటుంది. ఇప్పుడు హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ పరిస్థితి కూడా అలానే ఉంది. సౌత్‌ ఇండస్ట్రీలో మంచి హిట్టు కోసం ఈ అమ్మడు ఎదురుచూస్తోంది. ఇప్పటికే ఈ బామ్మ తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో అనేక సినిమాలు చేసింది. అయితే తెలుగులో మాత్రం చేసింది రెండు సినిమాలే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు జోడీగా ఓజీ మూవీలో ఛాన్స్ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ నేచురల్ స్టార్ నానికి జోడీగా సరిపోదా శనివారంలో నటిస్తోంది.

సరిపోదా శనివారం మూవీకి సంబంధించి ఇప్పటికే పోస్టర్స్, టీజర్, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. అవెంతో బజ్‌ను క్రియేట్ చేశాయని చెప్పాలి. త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానున్న ఈ మూవీపై ఆడియన్స్ మంచి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈమధ్యనే ఆగస్ట్ 24న సరిపోదా శనివారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. ఆ వేడుకల్లో ప్రియాంక చేసిన కామెంట్స్ పై ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు.

ఆఫర్ల కోసం ప్రియాంక అరుళ్ మోహన్ అలా మాట్లాడ్డం ఏంటని తెలుగు ఆడియన్స్ భగ్గుమంటున్నారు. సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎస్జే సూర్యను ప్రియాంక ఓ రిక్వెస్ట్ చేసింది. మళ్లీ ఎస్జే సూర్య డైరెక్షన్ చేస్తే ఖుషి2 తీయాలని, అది కూడా పవన్ కళ్యాణ్ తోనే చేయాలని స్టేజ్ మీద చెప్పింది. ఆ మాటలు విన్న తమిళ ఫ్యాన్స్ ప్రియాంకపై ఫైర్ అవుతున్నారు. తమిళ్‌లో విజయ్ దళపతి, జ్యోతిక కలిసి నటించిన సినిమా ఖుషి. దానికి రీమేక్‌గా తెలుగులో పవన్ నటించారు. ఒరిజినల్ సినిమా కంటే రీమేక్ చేసిన సినిమానే బాగుందని అంటావా? అంటూ ప్రియాంకపై తమిళ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆమెపై నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: