ఝమ్మందినాదం సినిమాతో తెలుగువారికి పరిచయమయ్యారు సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు చేతుల్లో పడటంతో ఆమె తన తొలి చిత్రంతోనే కుర్రకారుకు గిలిగింతలు పెట్టారు. స్మైల్, మెస్మరైజింగ్ లుక్‌, లే లేత అందాలతో డెబ్యూ మూవీతోనే బోల్డెంత పాపులారిటీ వచ్చింది. ఆ వెంటనే ప్రభాస్ , వెంకటేష్, రవితేజ వంటి బడా హీరోలతో నటించే ఛాన్సులు కొట్టేసింది. తర్వాత తన మకాంను హైదరాబాద్ నుంచి చెన్నైకి షిఫ్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ అక్కడా బడా స్టార్స్‌ పక్కన హీరోయిన్‌గా అవకాశాలను అందుకుంది. కానీ ఈ ముద్దుగుమ్మకు ఎందుకో స్టార్ డమ్ దక్కలేదు.తెలుగు సినీ పరిశ్రమలో అంతగా రాణించలేకపోయినా బాలీవుడ్‌లో మాత్రం తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న నటి ఈమె.తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. అలాగే తమిళ్‌లోనూ సినిమాలు చేసింది. ప్రస్తుతం తాప్సీ తెలుగులో సినిమాలు తగ్గించింది. పూర్తి ఫోకస్ ఆమె బాలీవుడ్ పైనే పెట్టింది. 2013లో వరుణ్ ధావన్ చిత్రంతో హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టింది.రెగ్యులర్ హీరోయిన్‌గా వెలుగొందిన తాప్సీ.. బేబీ, పింక్, ది ఘాజీ అటాక్, బద్లా, మిషన్ మంగళ్, తప్పడ్, హసీనా దిల్రూబా, రష్మీ రాకెట్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో హీరోయిన్ సెంట్రిక్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించింది. నటి తాప్సీ‌పన్ను హిందీ సినిమాతో అరంగేట్రం చేసినప్పటికీ.. తెలుగులోనూ ఈ అమ్మడి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇక హిందీలో మిషన్ మంగళ్, చాంత్‌కి ఆంక్, తప్పట్, హసీన్ దిల్రూబా వంటి చిత్రాలకు మంచి అంచనాలు వచ్చాయి. ముఖ్యంగా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ గా తెరకెక్కిన శభాష్ మిథులో మిథాలీ రాజ్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

 తాజాగా తాప్సీ తనకు ఫొటో గ్రాఫర్లకు ఉన్న వివాదంపై క్లారిటీ ఇచ్చింది. ‘నేను సెలబ్రిటీనే కానీ పబ్లిక్ ప్రాపర్టీని కాను. ఈ రెండిటి మధ్యా చాలా తేడా ఉంది. ఆ తేడా నాకు చాలా బాగా తెలుసు. ఒక సెలబ్రిటీని పబ్లిక్ ప్రాపర్టీ తరహాలో చూస్తే కుదరదు. ప్రతి ఒక్కరికీ తమ పర్సనల్ ప్రిఫరెన్స్ అనేది ఒకటి ఉంటుంది. పబ్లిక్ ప్రాపర్టీలో ఫొటో దిగడం, తీయించుకోవడం కొందరికి నచ్చొచ్చు. కానీ నాకు నచ్చదు. నాకు ఏం కావాలి అన్నది నాకు తెలుసు’’ అంటూ ఘాటుగానే చెప్పింది తాప్సీ.ఇటీవల ఆమె అక్షయ్ కుమార్ ‘కేల్ కేల్ మెయిన్’ మూవీలో నటించింది. చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నప్పటికీ తాప్సీ పన్ను పలు ఇంటర్వ్యూలో పాల్గొంటూ వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా, ఫొటోగ్రాఫర్లతో గొడవ పెట్టుకోవడంపై రియాక్ట్ అయింది.‘నాపై ఎవరైనా అరిస్తే నేను అస్సలు ఊరుకోను. అక్కడిక్కడే తిరిగి సమాధానం ఇచ్చేస్తా. అలాంటిది కెమెరాలతో నాపైకి దూసుకురావడం, ఫిజికల్‌గా హ్యాండిల్ చేయడం ఏంటి? దాన్ని నేను ఎలా సహిస్తాను. అది సరైన పద్దతి కూడా కాదు. నేను మొదల అమ్మాయిని.. ఆ తర్వాతే నటిని. నేనిలా చెప్తుంటే ఈ ప్రొఫెషన్‌కి నేను సరిపోను అని మీరు అనుకోవచ్చు. అది నా సమస్య కాదు. ఏదిఏమైనా నటన అనేది నాకు నచ్చిన ప్రొఫెషన్. అందుకే ఇంకా కొనసాగుతున్నా’’ అని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం అమ్మడి కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: