టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఆఖరుగా నా సామి రంగ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు ప్రముఖ డాన్స్ కొరియో గ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహించాడు . ఈ సినిమాతోనే ఈయన దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఆశకా రంగనాథ్మూవీ లో నాగార్జున కు జోడిగా నటించగా ... అల్లరి నరేష్ , రాజ్ తరుణ్మూవీ లో కీలక పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న నాగార్జున తన తదుపరి మూవీ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జున ఓ దర్శకుడు మూవీ కి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయంలోకి వెళితే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తన తదుపరి మూవీ చేయడానికి నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు , మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇకపోతే సురేందర్ రెడ్డి ఆఖరుగా నాగార్జున కుమారుడు అయినటువంటి అఖిల్ హీరోగా రూపొందిన ఏజెంట్ మూవీ కి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. మరి ఏజెంట్ లాంటి ఫ్లాప్ మూవీ తర్వాత సురేందర్ రెడ్డి , నాగార్జున తో మూవీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: