తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం వెట్టయన్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు జై భీమ్ సినిమా దర్శకుడు అయినటువంటి టీ జే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే తమిళ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి సూర్య ప్రస్తుతం కంగువా అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

మూవీ ని అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు చాలా రోజుల క్రితమే ఈ మూవీ బృందం వారు ప్రకటించింది. తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన ఈ ఇద్దరు హీరోలు నటించిన రెండు సినిమాలు ఒకే తేదీన విడుదల కానున్నట్లు అధికారిక ప్రకటన రావడంతో ఈ రెండు మూవీ ల మధ్య భారీ బాక్స్ ఆఫీస్ వార్ జరిగే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అంచనా వేశారు. కానీ రజనీ కాంత్ కు భారీ గండం తప్పినట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే కంగువా సినిమా అక్టోబర్ 10 వ తేదీన విడుదల అయ్యే అవకాశం లేదు అని , ఈ సినిమా పోస్ట్ పోన్ కానున్నట్లు కొత్త విడుదల తేదీని మరికొన్ని రోజుల్లోనే అధికారికంగా ప్రకటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక కాంగువ సినిమా నిజంగానే విడుదల వాయిదా పడినట్లు అయితే రజనీ కాంత్ కి తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర తిరిగే లేకుండా పోతుంది. మరి కంగువా సినిమా నిజం గానే పోస్ట్ పోన్ అవుతుందా ... అయితే ఏ తేదీన విడుదల అవుతుంది అనే విషయం చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: