భారీ అంచనాల మధ్య ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న విడుదలైన రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయింది.. ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా వచ్చినా ఈ మూవీ సినిమాలోని కథా,కంటెంట్, క్యారెక్టర్స్ వంటిని కూడా పూరి జగన్నాథ్ వావ్ అనేంతలా చూపించలేదు.. అందరు హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చే పూరి జగన్నాథ్ స్క్రిప్ట్ ఎందుకో ఈమధ్య కాస్త తప్పుతోంది. ఈయన రాంగ్ రూట్లోకి వెళ్తున్నారని ఆయన అభిమానులు బాధపడుతున్నారు.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా వస్తుందంటే మినిమం హిట్ గ్యారంటీ అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. కానీ ఈ మధ్యకాలంలో ఏమైందో ఏమో కానీ పూరి జగన్నాథ్ దర్శకత్వం అంత బాగుండడం లేదు. ఇక భారీ అంచనాల మధ్య రామ్ పోతినేని,కావ్య థాపర్ లు హీరో హీరోయిన్స్ గా చేసిన ఈ డబుల్ ఇస్మార్ట్ మూవీ మొదటి రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

 దాంతో ఈ సినిమా ఎఫెక్ట్ తో పూరి జగన్నాథ్ తనకు సంబంధించిన ఖరీదైన ప్రాపర్టీ అమ్మేసినట్టు టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల్లో కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఇక పూరి జగన్నాథ్ తనకి హిట్స్ వస్తే ఖచ్చితంగా ఆ డబ్బులను వృధా ఖర్చులకు తగిలేయకుండా ఏదో ఒక కాస్ట్లీ ప్రాపర్టీని కొనుగోలు చేస్తారట.కానీ నష్టం వస్తే మాత్రం మొదట అదే ప్రాపర్టీని అమ్మి నష్టపోయిన వారి అప్పులన్నీ ముందుగా తీర్చేస్తారట అయితే గతంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ అయిన సమయంలో శంషాబాద్ లో ఒక ఖరీదైన ఫ్లాట్ ని కొనుగోలు చేశారట.

కానీ తాజాగా డబుల్ ఇస్మార్ట్ సినిమా భారీ ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమాకి సంబంధించిన నష్టాన్ని పూడ్చడం కోసం శంషాబాద్ లో కొన్న అదే ఫ్లాట్ ని 18 కోట్లకు అమ్మినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా డబుల్ ఇస్మార్ట్ సినిమా నైజాం హక్కులను కొనుగోలు చేసిన నిరంజన్ రెడ్డి బాగా నష్టపోయినట్టు తెలుస్తోంది. అయితే ఈయనకి జరిగిన నష్టానికి కూడా త్వరలోనే పూరి జగన్నాథ్ డబ్బులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ  టాలీవుడ్ లో స్టార్ దర్శకులలో ఒకరిగా ఉన్న పూరి జగన్నాథ్ ప్రస్తుతం  వరుస ప్లాపులతో ఫ్లాప్ దర్శకుల లిస్టులో చేరిపోతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: