అందాల ముద్దుగుమ్మ ప్రియాంక అరుల్ మోహన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన నానిస్ గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయం సాధించినప్పటికీ ఈ మూవీ ద్వారా ఈ బ్యూటీ కి మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఇకపోతే తాజాగా ప్రియాంక అరుల్ మోహన్ , నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన సరిపోదా శనివారం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ ని ఆగస్టు 29 వ తేదీన విడుదల చేయనున్నారు.

దానితో ఈ మూవీ బృందం వారు వరుసగా ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ లను నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమా ఈవెంట్ లో ప్రియాంక అరుల్ మోహన్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ప్రియాంక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అసలు విషయం లోకి వెళ్ళితే ... కొన్ని సంవత్సరాల క్రితం ఎస్ జె సూర్య తమిళ్ లో విజయ్ హీరో గా ఖుషి మూవీ ని , తెలుగు లో పవన్ కళ్యాణ్ హీరో గా ఖుషి మూవీ ని రూపొందించాడు. ఈ రెండు మూవీ లు కూడా మంచి విజయాలను అందుకున్నాయి.

ఇక ప్రియాంక తాజాగా మాట్లాడుతూ ... సూర్య సార్ మళ్లీ మీరు సినిమాకి దర్శకత్వం వహించాలి. అది ఖుషి 2 మూవీ అయి ఉండాలి.  మీరు కచ్చితంగా పవన్ కళ్యాణ్ తో ఖుషి  సినిమా చేయండి. అది ఒక క్లాసిక్ అని అంది. దీనితో పవన్ కళ్యాణ్ అభిమానులంతా అవును కచ్చితంగా ఖుషి 2 పవన్ తోనే చేయాలి అని అంటూ ఉంటే , విజయ్ అభిమానులు ఖుషి సినిమాలో విజయ్ కూడా అద్భుతంగా నటించాడు అని వారు స్పందిస్తున్నారు. ఇలా ప్రియాంక తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Pam