టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ నమిత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2002లో సొంతం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన నమిత మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. స్లిమ్ ఫిగర్ మెయింటైన్ చేస్తూ ఎంతోమంది అభిమానుల మనసులను దోచుకునే నమిత అప్పట్లో ఎంతోమందికి ఫేవరెట్ హీరోయిన్గా నిలిచిందని చెప్పవచ్చు. అంతేకాదు తన అందం, నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.


అయితే ఈమె ఒకానొక సమయంలో స్టార్ హీరోతో ఎఫైర్ పెట్టుకుందని, అది చూసి తట్టుకోలేకపోయిన ఒక స్టార్ డైరెక్టర్ ఆమెను సెట్ లో అందరి ముందు అవమానించారని అప్పట్లో టాక్ వినిపించింది. ఇదిలా ఉండగా తాజాగా నమిత సంచలన కామెంట్ చేసింది. మధుర మీనాక్షి దేవాలయ సిబ్బంది తనతో ఆ గౌరవంగా మాట్లాడారని, తనని దేవాలయంలోకి వెళ్ళనివ్వలేదని నమిత ఆరోపించారు. ఈ విషయాన్ని ఆమె వీడియో రూపంలో రిలీజ్ చేశారు.


కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా కుటుంబంతో కలిసి మీనాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్ళా. ఆలయంలోకి వెళ్లకుండా అక్కడి సిబ్బంది నన్ను అడ్డుకున్నారు. నాకు సంబంధించిన సర్టిఫికెట్స్ చూపించాలన్నారు. ఈ వ్యాఖ్యలు నన్నెంతో బాధించాయి. తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రముఖ ఆలయాలను తాను సందర్శించినట్లు చెప్పారు. ఆ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నానని నమిత వీడియోలో కోరారు.


నమిత వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో ఈ ఘటనపై ఆలయ పరిపాలన సిబ్బంది స్పందించారు. నమితతో ఎవ్వరూ అమర్యాదకరంగా వ్యవహరించలేదు. ఆలయ నియమాల ప్రకారమే ఆమెతో మాట్లాడం. పై అధికారులు చెప్పడంతో కొంత సమయం ఆగమని చెప్పాము. ఆ తర్వాత ఆమెను దేవాలయంలోకి అనుమతించాం అని తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు ఈ అంశం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: