నాని , ప్రియాంక అరుల్ మోహన్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించిన చిత్రం 'సరిపోదా శనివారం'. ఈనెల 29న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‎లో నాని మాట్లాడుతూ 'ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతే రేంజ్‌‎లో సినిమా సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నా. వివేక్‌‎కు ఇది మైల్ స్టోన్‌‎లా ఉంటుంది. కచ్చితంగా అందర్నీ ఎంగేజ్ చేసేలా సినిమా ఉంటుంది. మంచి సినిమాలు వస్తే.. పోతారు.. అందరూ థియేటర్స్‌‎కు పోతారు' అని అన్నాడు.ఇది తనకు స్పెషల్ ఫిలిం అని చెప్పింది ప్రియాంక అరుల్ మోహన్. వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ 'నాని నాకు ఇచ్చింది చాన్స్ కాదు.. కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఆయన నాపై ఉంచిన నమ్మకానికి ఈ సినిమా ఇచ్చా' అని అన్నాడు. 'కథల ఎంపికలో నాని బెస్ట్. ఆయనతో సినిమా చేస్తే నిర్మాతకు టెన్షన్ ఉండదు. ఇది కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది' అని నిర్మాతలు అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకులు దేవకట్టా, శ్రీకాంత్ ఓదెల, శైలేష్ కొలను, శౌర్యవ్, ప్రశాంత్ వర్మ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. నటులు ఎస్.జె. సూర్య, అలీ, అతిథి, అనిత చౌదరి, అభిరామి, కెమెరామెన్ మురళీ, సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ తదితరులు పాల్గొన్నారు.ఇక ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ మూవీకి U/A సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక ఈ సినిమా రన్ టైమ్ గురించి హీరో నాని సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశాడు. ఇందులో నాని సినిమా రన్ టైం 2 గంటల 35 నిమిషాలు అని చెప్పగా.. వెనక నుంచి ఎస్‌జే సూర్య వచ్చి ప్లస్ 15 మినిట్స్ అని అన్నాడు. అంటే మొత్తం సినిమా రన్‌టైం 2 గంటల 50 నిమిషాలు.ఇదిలా ఉంటే.. ఈ సినిమా బుక్సింగ్స్‌ను ఓపెన్ చేశారు. ఈ విషయాన్ని కూడా నాని సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. అంటే సుందరానికి మూవీ తరువాత నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో సరిపోదా శనివారం చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: