ఐకాన్‌ స్టార్‌, జాతీయ నటుడు అల్లు అర్జున్‌ నటిస్తున్న తాజా  సెన్సేషనల్ సినిమా ‘పుష్ప-2’ గురించి  ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తెలిసిన విషయమే. ఈ సినిమాను క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోవడం  ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.పుష్ప మొదటి పార్ట్ వచ్చి దాదాపు నాలుగేళ్ళు అవుతున్నా రెండో పార్ట్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు. బాహుబలి రెండో పార్ట్ కంటే ఎక్కువ సమయం తీసుకుంది పుష్ప 2వ పార్ట్. ఈ సినిమా విషయంలో సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే వార్తలు వచ్చాయి. దీని వెనుక కారణం ఏంటీ అనే దానిపై స్పష్టత లేకపోయినా సోషల్ మీడియాతో పాటుగా కొన్ని వార్తా సంస్థల్లో వస్తున్న వార్తలు హైలెట్ గా మారుతున్నాయి.అల్లు అర్జున్ ఇప్పుడు మెగా ఫ్యామిలీ కి దూరంగా ఉన్నారు. ఆయనను టార్గెట్ చేయడానికి మెగా ఫ్యాన్స్ తో పాటుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కూడా ఆగ్రహంగా ఉన్నారు. అల్లు అర్జున్… మెగా ఫ్యామిలికి దూరంగా ఉండటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఇప్పుడు రామ్ చరణ్ సహా పలువురు మెగా హీరోలతో కూడా పెద్దగా మాట్లాడటానికి ఆసక్తి చూపడం లేదు అని అంటున్నారు. ఇప్పుడు పుష్ప 2 సినిమా హిట్ అయితే మెగా ఫ్యామిలీ మొత్తానికి సమాధానం చెప్పాలని ఆయన భావిస్తున్నారట.

అందుకే పుష్ప 2 సినిమా ఆలస్యం అయినా అల్లు అర్జున్ పెద్దగా జోక్యం చేసుకోవడం లేదని ఆలస్యం అయినా సరే పెద్దగా ఇబ్బంది లేదని చెప్పారట. అందుకే సుకుమార్ కూడా అల్లు అర్జున్ మాటను పరిగణలోకి తీసుకుని జాగ్రత్తగా ఉన్నారట. ఇదిలా ఉంటే తాజాగా పుష్ప టీం ఆసక్తికర కామెంట్స్ చేసింది. పుష్ప మొదటి పార్ట్ సినిమా క్లైమాక్స్ చాలా బాగుందని… మరి రెండో పార్ట్ క్లైమాక్స్ ఎలా ఉంటుంది అని హింట్ ఇవ్వొచ్చు అని అడిగితే… సోషల్ మీడియా  ద్వారా… పుష్ప టీం రియాక్ట్ అయింది.ఇక ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ షూటింగ్ ఇటీవల పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే, ఓ అభిమాని ఈ క్లైమాక్స్ షూట్ ఎలా వచ్చిందని చిత్ర బృందాన్ని అడగగా…దానికి ‘పుష్ప-2’ మేకర్స్ ఇంట్రెస్టింగ్‌గా సమాధానం చెప్పారు. నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’ నుంచి ‘‘పోతారు.. మొత్తం పోతారు..’’ అనే డైలాగ్‌తో ‘పుష్ప-2’ మేకర్స్ ఇచ్చిన క్లారిటీ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది..మొత్తానికి ‘పుష్ప-2’ మూవీ క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని.. ఈ సినిమాతో అభిమానులకు పూనకాలు రావడం ఖాయమని వారు పెద్ద హింటే ఇచ్చారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ మరోసారి తన విధ్వంసకరమైన పర్ఫార్మెన్స్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకోనుండగా, అందాల భామ రష్మిక మందన్న మరోసారి తన నటనతో అలరించనుంది.ఇదిలా ఉండగా పుష్ప2 మూవీ ఎలా ఉంటుందో మేకర్స్ ఒక్క ముక్కలో చెప్పేశారు. సినిమా క్లైమాక్స్ చాలా బాగా వచ్చింది. ఇచ్చి పడేసారని టాక్. మొత్తం సినిమా ఎలా ఉందో ఒక హింట్ ఇవ్వచ్చుగా అని మేకర్స్ ను ట్యాగ్ చేస్తూ ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. దీనికి పుష్పా సోషల్ మీడియా ఖాతా స్పందిస్తూ పోతారు మొత్తం పోతారు అని సరిపోదా శనివారం మూవీ టెంప్లేట్ షేర్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: