కృష్ణంరాజు వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమైన ప్రభాస్ ఇక ఎప్పుడు గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. బాహుబలి ముందు వరకు కూడా టాలీవుడ్ లో రెబల్ స్టార్ గా తెలుగు పరీక్షకుల డార్లింగ్ గా కొనసాగిన ప్రభాస్ బాహుబలి తర్వాత మాత్రం పాన్ ఇండియా  రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక అప్పటినుంచి ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ కేవలం ఇండియాలోనే కాదండోయ్.. వరల్డ్ వైడ్ గా కూడా సూపర్ హిట్ సాధిస్తూ వచ్చాయి అన్న విషయం తెలిసిందే.


 అయితే బాహుబలి లాంటి వరల్డ్ వైడ్ హీట్ తర్వాత కొన్నాళ్లపాటు వరస ప్లాపులతో సతమతమైన ప్రభాస్ సలార్ అనే మూవీతో మళ్ళీ సాలిడ్ హిట్ కొట్టి ట్రాక్ లోకి వచ్చేసాడు. ఇక మొన్నటికి మొన్న కల్కి అనే మూవీతో 1100 కోట్ల కలెక్షన్స్ సాధించి ఇండియన్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేశాడు అని చెప్పాలి. ఇక ఈ సినిమాతో భారత చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. అయితే కల్కి మూవీ తర్వాత ప్రభాస్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు వచ్చింది అన్న విషయాన్ని రాజసాబ్ మూవీలో ప్రభాస్ సరసన నటిస్తున్న మాళవిక మోహన్ చెప్పుకొచ్చారు. ఇటీవల ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


 కల్కి సినిమా విడుదలకు ముందు నుంచే ప్రభాస్ తో రాజాసాబ్ షూటింగ్లో పాల్గొంటున్నట్లు మాళవిక మోహన్ చెప్పుకొచ్చారు. అయితే కల్కి బ్లాక్ బస్టర్ విజయం సాధించిన తర్వాత కూడా ప్రభాస్ లో ఎలాంటి మార్పు రాలేదని అంతే వినయంగా ఉంటున్నారు అంటూ చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్. తెలుగు చిత్ర పరిశ్రమలో తన తొలి సినిమాలోనే ప్రభాస్ లాంటి స్టార్ హీరో మూవీలో నటించడం నిజంగా అదృష్టం అంటూ మాళవిక మోహన్ చెప్పుకొచ్చింది. కాగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ మూవీ విడుదలకు సిద్ధమవుతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: