టాలీవుడ్ హీరో రవితేజ ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. కానీ గతవారం RC -75 సినిమా షూటింగ్ జరుగుతున్న సందర్భంగా ఒక్కసారిగా ప్రమాదానికి గురవ్వడంతో ఆరు నెలల పాటు రెస్టు తీసుకోవాలని వైద్యులు తెలియజేశారు. దీంతో ఈ విషయం రవితేజ అభిమానులను కాస్త నిరాశపరిచింది. ఇదంతా ఇలా ఉండగా రవితేజతో ఒకవైపు హీరోయిన్ గా వదినగా నటించిన ఒక హీరోయిన్ ఉందట. ఆ హీరోయిన్ ఎవరు ఏ ఏ చిత్రాలలో నటించిందో వాటి గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.



రవితేజకు హీరోయిన్ గా వదినగా నటించింది ఎవరో కాదు హీరోయిన్ శృతిహాసన్.. వీరిద్దరూ కలిసి రెండు సూపర్ హిట్ చిత్రాల నటించారు.. ఒకటి గోపీచంద్ మలినేని డైరెక్షన్లో వచ్చిన బలుపు సినిమా. ఆ తర్వాత క్రాక్ సినిమాతో మళ్లీ మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ రెండు చిత్రాలు సక్సెస్ను ఇచ్చాయి. క్రాక్ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. అయితే రవితేజకు వదినగా శృతిహాసన్ నటించిన సినిమా ఏంటనే విషయానికి వస్తే.. వాల్తేరు వీరయ్య సినిమా ఇందులో చిరంజీవి హీరోగా నటించారు.


వాల్తేరు వీరయ్య చిత్రంలో చిరు తమ్ముడిగా రవితేజ నటించిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా శృతిహాసన్ నటించింది. టెక్నికల్ పరంగా చూసుకుంటే శృతిహాసన్, రవితేజకు వదిన వరుస అవుతుంది వాల్తేరు వీరయ్య సినిమాలో. ఇలా క్రాక్, బలుపు చిత్రాలలో హీరోయిన్గా కూడా నటించింది. ప్రస్తుతం శృతిహాసన్ వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తోంది. గత ఏడాది సలార్ సినిమాలో భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు అడవి శేషుతో డేకాయిట్ సినిమాతో పాటుగా సలార్ సీక్వెల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. శృతిహాసన్ తన జీవితంలో లవ్ ఎఫైర్ రూమర్స్ వల్ల బాగానే పాపులారిటీ అందుకుంది. ఇటీవల కూడా మళ్లీ లవ్ బ్రేకప్ అయినట్లుగా ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: