ఈమధ్య కాలంలో విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ ‘ఆయ్’ సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆ రెండు సినిమాలకు కలక్షన్స్ అంతంత మాత్రంగానే ఉండటంతో ధియేటర్లు చెప్పుకోతగ్గ స్థాయిలో కళకళలాడలేదు. దీనితో ఇండస్ట్రీ వర్గాల ఆశక్తి అంతా ఈవారం విడుదలకాబోతున్న ‘సరిపోదా శనివారం’ పై ఉంది.



ఈసినిమా టైటిల్ అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఈమూవీ పై అన్ని వర్గాలలోనూ ఆశక్తి బాగా ఉంది. ‘కల్కి 2898’ మూవీ తరువాత సరైన బ్లాక్ బష్టర్ హిట్ లేకపోవడంతో ధియేటర్లు అన్నే బోసిపోతున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీ చూపు అంతా ఈమూవీ పైనే ఉంది. ఈసినిమాను నాని చాల కష్టపడి దేశం అంతా తిరుగుతూ ఈమూవీని ప్రమోట్ చేశాడు. అయితే ఈమూవీ నిడివికి సంబంధించి వస్తున్న వార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. తెలుస్తున్న సమాచారంమేరకు ఈమూవీ నిడివి 2 గంటల 50 నిముషాలు అని తెలుస్తోంది.



అయితే సుమారు మూడు గంటల పాటు ధియేటర్లలో ప్రేక్షకుడు కూర్చుని ఈసినిమాను ఎంజాయ్ చేయాలి అంటే ఈమూవీ కథలో అదేవిధంగా మేకింగ్ లో ప్రత్యేకత కనిపించినప్పుడు మాత్రమే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. దీనితో ఈమూవీలో సగటు ప్రేక్షకుడుని ఎంజాయ్ చేయించగల అంశాలు ఉన్నాయా అన్న సందేహాలు చాలమందికి వస్తున్నాయి.



ఇది ఇలా ఉండగా ఈసినిమాకు సంబంధించి హీరో నాని దేశం అంతా ప్రమోట్ చేస్తూ తన పాన్ ఇండియా ఇమేజ్ పెంచుకోవడానికి నాని దేశంలోని అనేక ప్రముఖ నగరాలు ఇప్పటికే కవర్ చేశాడు. ఈసినిమాకు సంబంధించిన టిక్కెట్లను ఆన్ లైన్ లో బుక్ మై షో యాప్ ద్వారా ఓపెన్ చేసిన వెంటనే వస్తున్న స్పందన కూడ ఈమూవీ పై అంచనాలను పెంచుతున్నాయి.  



ఈమధ్యకాలంలో భారీ సినిమాలకు సంబంధించి టిక్కెట్ల అడ్వాన్స్ బుకింగ్ కు వచ్చిన స్పందన రేంజ్ లో ‘సరిపోదా శనివారం’ కు వస్తున్న స్పందన టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఈ ఒక్క విషయంలోనే కాదు ప్రమోషన్లు పబ్లిసిటీ ఇలా ప్రతి విషయంలోనూ నాని అన్నింటా తానై వ్యవహరిస్తూ టాప్ హీరోలు తమ సినిమాలను ఎలా వ్యూహాత్మకంగా ప్రమోట్ చేసుకోవాలో మార్గం చూపెడుతున్నాడు అనుకోవాలి..  








మరింత సమాచారం తెలుసుకోండి: